AP News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మహిళలు ఒక్కొక్కరికి రూ.24 వేలు
- దృష్ట్యా కూటమి ప్రభుత్వం కొత్త పథకాలను ప్రవేశపెట్టాలని నిర్ణయం
- ఈ కొత్త పథకాలలో ముఖ్యంగా మహిళలకు ఆర్థిక మద్దతు కల్పించేందుకు పెద్ద మొత్తంలో సంక్షేమ పథకాలు
- అధికారులు ఇప్పటికే ఈ పథకాలకు సంబంధించిన ప్రతిపాదనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP News: గత వైసీపీ ప్రభుత్వంలో బీసీ వర్గాలకు అందుబాటులో లేని సంక్షేమ పథకాలు, రాయితీల దృష్ట్యా కూటమి ప్రభుత్వం కొత్త పథకాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ కొత్త పథకాలలో ముఖ్యంగా మహిళలకు ఆర్థిక మద్దతు కల్పించేందుకు పెద్ద మొత్తంలో సంక్షేమ పథకాలను అమలు చేయడం కీలకంగా భావిస్తోంది. బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఇప్పటికే ఈ పథకాలకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించగా, సీఎం చంద్రబాబు ఆమోదం పొందగానే వాటిని అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
ఇప్పటికే మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణను అందించడంపై సన్నాహాలు ప్రారంభించగా, యువతకు జనరిక్ మందుల షాపుల ఏర్పాటు ప్రక్రియ కూడా ముందుకు సాగింది. ఈ చర్యలు బీసీ వర్గాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందించడంలో సహాయపడతాయి.
Also Read
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- Praggnanandhaa Beat Magnus Carlsen: ఒకే టోర్నీలో రెండుసార్లు.! ప్రపంచ నెం.1 కార్ల్సెన్కు మరో ఓటమిని రుచి చూపిన ప్రజ్ఞానంద..
- Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
- Peddi Ticket Prices Hike: 'పెద్ది' సినిమా టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్.. రోజుకు 5 షోలకు అనుమతి.!
2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం బీసీ వర్గాలకు అందించిన పథకాలను తిరిగి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ అందించేందుకు ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించవలసిన ఆదేశాలు బీసీ సంక్షేమ శాఖకు ఇచ్చింది. ఇందులో భాగంగా, టైలరింగ్లో శిక్షణ ఇచ్చేందుకు పలు సంస్థల నుండి టెండర్లను ఆహ్వానించింది. నైపుణ్యాభివృద్ధి కింద ఒప్పందాలు కూడా పూర్తయినట్లు సమాచారం. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 80,000 మంది బీసీ మహిళలకు లాభం చేకూరనుంది. 90 రోజుల టైలరింగ్ శిక్షణ పూర్తిచేసిన మహిళలకు ఒక్కొక్కరికి రూ.24,000 విలువ గల కుట్టుమిషన్ ఉచితంగా అందించబడుతుంది. ఈ కోసం దరఖాస్తులను ఓబీఎంఎస్ సైట్ ద్వారా స్వీకరించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.
సంక్షేమ పథకాలు కూడా నిరుద్యోగ యువతకు ఊరట కలిగిస్తాయి. సిటీలకు వెళ్లే సౌకర్యం లేక ఉన్న ఊళ్లలో నిరుద్యోగంగా ఉన్న బీసీ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జనరిక్ మందుల షాపులు ప్రారంభించేందుకు యువతకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ షాపుల ద్వారా మందుల వాడకం పెంచడమే కాక, బీఫార్మసీ, ఎంఫార్మసీ చేసిన వారికి రూ.8 లక్షల రుణం అందించే అవకాశాన్ని బీసీ సంక్షేమ శాఖ కల్పిస్తోంది. ఇందులో రూ.4 లక్షలు సబ్సిడీగా అందించనున్నారు. సీఎం అనుమతి పొందగానే ఈ పథకాలు అమలులోకి రానున్నాయి.
Komuravelle: రేపు మల్లికార్జున స్వామి కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రులు
తాజావార్తలు
-
Obsession Collections : 7 కోట్ల బడ్జెట్ తో 1000కోట్లకు పైగా కలెక్షన్లు… బాక్సాఫీస్ లో అదరగొడుతన్న హారర్ థ్రిల్లర్
-
Prabhas : జెట్ స్పీడ్ లో స్పిరిట్ షూట్.. టీజర్ ఎప్పుడంటే?
-
DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
-
DK Shivakumar: నేడు సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.. దేవాలయాల్లో పూజలు, వీవీఐపీలకు ప్రత్యేక ఆహ్వానాలు!
-
Pension Scheme: నెలకు రూ.55 పెట్టుబడి..రిటైర్ అయ్యాక నెలనెలా అకౌంట్లోకి డబ్బులు..ఈ ప్రభుత్వ పెన్షన్ స్కీమ్ గురించి తప్పక తెలుసుకోండి!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!