AP News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మహిళలు ఒక్కొక్కరికి రూ.24 వేలు
- దృష్ట్యా కూటమి ప్రభుత్వం కొత్త పథకాలను ప్రవేశపెట్టాలని నిర్ణయం
- ఈ కొత్త పథకాలలో ముఖ్యంగా మహిళలకు ఆర్థిక మద్దతు కల్పించేందుకు పెద్ద మొత్తంలో సంక్షేమ పథకాలు
- అధికారులు ఇప్పటికే ఈ పథకాలకు సంబంధించిన ప్రతిపాదనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP News: గత వైసీపీ ప్రభుత్వంలో బీసీ వర్గాలకు అందుబాటులో లేని సంక్షేమ పథకాలు, రాయితీల దృష్ట్యా కూటమి ప్రభుత్వం కొత్త పథకాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ కొత్త పథకాలలో ముఖ్యంగా మహిళలకు ఆర్థిక మద్దతు కల్పించేందుకు పెద్ద మొత్తంలో సంక్షేమ పథకాలను అమలు చేయడం కీలకంగా భావిస్తోంది. బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఇప్పటికే ఈ పథకాలకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించగా, సీఎం చంద్రబాబు ఆమోదం పొందగానే వాటిని అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
ఇప్పటికే మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణను అందించడంపై సన్నాహాలు ప్రారంభించగా, యువతకు జనరిక్ మందుల షాపుల ఏర్పాటు ప్రక్రియ కూడా ముందుకు సాగింది. ఈ చర్యలు బీసీ వర్గాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందించడంలో సహాయపడతాయి.
Also Read
2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం బీసీ వర్గాలకు అందించిన పథకాలను తిరిగి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ అందించేందుకు ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించవలసిన ఆదేశాలు బీసీ సంక్షేమ శాఖకు ఇచ్చింది. ఇందులో భాగంగా, టైలరింగ్లో శిక్షణ ఇచ్చేందుకు పలు సంస్థల నుండి టెండర్లను ఆహ్వానించింది. నైపుణ్యాభివృద్ధి కింద ఒప్పందాలు కూడా పూర్తయినట్లు సమాచారం. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 80,000 మంది బీసీ మహిళలకు లాభం చేకూరనుంది. 90 రోజుల టైలరింగ్ శిక్షణ పూర్తిచేసిన మహిళలకు ఒక్కొక్కరికి రూ.24,000 విలువ గల కుట్టుమిషన్ ఉచితంగా అందించబడుతుంది. ఈ కోసం దరఖాస్తులను ఓబీఎంఎస్ సైట్ ద్వారా స్వీకరించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.
సంక్షేమ పథకాలు కూడా నిరుద్యోగ యువతకు ఊరట కలిగిస్తాయి. సిటీలకు వెళ్లే సౌకర్యం లేక ఉన్న ఊళ్లలో నిరుద్యోగంగా ఉన్న బీసీ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జనరిక్ మందుల షాపులు ప్రారంభించేందుకు యువతకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ షాపుల ద్వారా మందుల వాడకం పెంచడమే కాక, బీఫార్మసీ, ఎంఫార్మసీ చేసిన వారికి రూ.8 లక్షల రుణం అందించే అవకాశాన్ని బీసీ సంక్షేమ శాఖ కల్పిస్తోంది. ఇందులో రూ.4 లక్షలు సబ్సిడీగా అందించనున్నారు. సీఎం అనుమతి పొందగానే ఈ పథకాలు అమలులోకి రానున్నాయి.
Komuravelle: రేపు మల్లికార్జున స్వామి కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రులు
తాజావార్తలు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!