AP News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మహిళలు ఒక్కొక్కరికి రూ.24 వేలు
- దృష్ట్యా కూటమి ప్రభుత్వం కొత్త పథకాలను ప్రవేశపెట్టాలని నిర్ణయం
- ఈ కొత్త పథకాలలో ముఖ్యంగా మహిళలకు ఆర్థిక మద్దతు కల్పించేందుకు పెద్ద మొత్తంలో సంక్షేమ పథకాలు
- అధికారులు ఇప్పటికే ఈ పథకాలకు సంబంధించిన ప్రతిపాదనలు
AP News: గత వైసీపీ ప్రభుత్వంలో బీసీ వర్గాలకు అందుబాటులో లేని సంక్షేమ పథకాలు, రాయితీల దృష్ట్యా కూటమి ప్రభుత్వం కొత్త పథకాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ కొత్త పథకాలలో ముఖ్యంగా మహిళలకు ఆర్థిక మద్దతు కల్పించేందుకు పెద్ద మొత్తంలో సంక్షేమ పథకాలను అమలు చేయడం కీలకంగా భావిస్తోంది. బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఇప్పటికే ఈ పథకాలకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించగా, సీఎం చంద్రబాబు ఆమోదం పొందగానే వాటిని అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
ఇప్పటికే మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణను అందించడంపై సన్నాహాలు ప్రారంభించగా, యువతకు జనరిక్ మందుల షాపుల ఏర్పాటు ప్రక్రియ కూడా ముందుకు సాగింది. ఈ చర్యలు బీసీ వర్గాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందించడంలో సహాయపడతాయి.
Also Read
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం బీసీ వర్గాలకు అందించిన పథకాలను తిరిగి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ అందించేందుకు ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించవలసిన ఆదేశాలు బీసీ సంక్షేమ శాఖకు ఇచ్చింది. ఇందులో భాగంగా, టైలరింగ్లో శిక్షణ ఇచ్చేందుకు పలు సంస్థల నుండి టెండర్లను ఆహ్వానించింది. నైపుణ్యాభివృద్ధి కింద ఒప్పందాలు కూడా పూర్తయినట్లు సమాచారం. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 80,000 మంది బీసీ మహిళలకు లాభం చేకూరనుంది. 90 రోజుల టైలరింగ్ శిక్షణ పూర్తిచేసిన మహిళలకు ఒక్కొక్కరికి రూ.24,000 విలువ గల కుట్టుమిషన్ ఉచితంగా అందించబడుతుంది. ఈ కోసం దరఖాస్తులను ఓబీఎంఎస్ సైట్ ద్వారా స్వీకరించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.
సంక్షేమ పథకాలు కూడా నిరుద్యోగ యువతకు ఊరట కలిగిస్తాయి. సిటీలకు వెళ్లే సౌకర్యం లేక ఉన్న ఊళ్లలో నిరుద్యోగంగా ఉన్న బీసీ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జనరిక్ మందుల షాపులు ప్రారంభించేందుకు యువతకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ షాపుల ద్వారా మందుల వాడకం పెంచడమే కాక, బీఫార్మసీ, ఎంఫార్మసీ చేసిన వారికి రూ.8 లక్షల రుణం అందించే అవకాశాన్ని బీసీ సంక్షేమ శాఖ కల్పిస్తోంది. ఇందులో రూ.4 లక్షలు సబ్సిడీగా అందించనున్నారు. సీఎం అనుమతి పొందగానే ఈ పథకాలు అమలులోకి రానున్నాయి.
Komuravelle: రేపు మల్లికార్జున స్వామి కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రులు
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!