VVS Laxman: ముంబైలో బీసీసీఐ కీలక భేటీ.. వీవీఎస్ లక్ష్మణ్కు అదిరే శుభవార్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో భారత క్రికెట్ బోర్డు అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ కీలక భేటీలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్లతో పాటు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) అధిపతి వీవీఎస్ లక్ష్మణ్ పాల్గొన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, కార్యదర్శి దేవజిత్ సైకియా, కోశాధికారి ప్రభతేజ్ సింగ్ భాటియా, తాత్కాలిక సీఈఓ హేమాంగ్ అమీన్ ఈ భేటీలో భాగమయ్యారు. ఈ ఏడాది చివర్లో న్యూజిలాండ్ పర్యటన, వచ్చే ఏటా జరగనున్న వన్డే ప్రపంచకప్ సన్నాహకాల నేపథ్యంలో ఈ సమావేశం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల సిరీస్లలో జట్టు వైఫల్యాలు, ఆటగాళ్ల ఫిట్నెస్, భవిష్యత్ ప్రణాళికలపై ప్రధానంగా చర్చించారు. ఇంగ్లాండ్, ఐర్లాండ్లలో ఆడిన ఆరు టి20ల్లో భారత్ ఒక్కటి కూడా గెలవకపోవడం ఆందోళన కలిగించింది. అలాగే ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉన్నందున, రాబోయే న్యూజిలాండ్ ఆల్-ఫార్మాట్ సిరీస్ (5 టి20లు, 5 వన్డేలు, 2 టెస్టులు) సాధ్యాసాధ్యాలపై విస్తృతంగా సమీక్షించారు. ఆటగాళ్ల పనిభారం మేనేజ్మెంట్, బ్యాకప్ ఆప్షన్ల ఎంపికపై కోచింగ్ స్టాఫ్ స్పష్టమైన ప్లాన్తో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని బోర్డు అభిప్రాయపడింది.
Also Read
- Imran Masood: ‘నా కూతురు 6 నెలలుగా ఇంట్లోనే ఉంది’.. అల్లుడు ఎస్పీలో చేరడంపై కాంగ్రెస్ ఎంపీ ఆవేదన
- EPFO కొత్త పథకం.. 6 నెలలే అందుబాటులో ఉండే ఈ కొత్త స్కీమ్తో ఎవరికి లబ్ధి..? పూర్తి వివరాలు..
- AP Cabinet Decisions: రైతులకు గుడ్న్యూస్.. అమరావతిపై ఫోకస్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- Rupee: సంక్షోభం సమయంలో ఆర్బీఐ మాస్టర్ ప్లాన్.. భారీగా పుంజుకున్న రూపాయి విలువ
ముఖ్యంగా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. రోహిత్ రిటైర్మెంట్పై సాగుతున్న ప్రచారాన్ని కార్యదర్శి దేవజిత్ సైకియా ఖండించినప్పటికీ, 2027 వన్డే ప్రపంచకప్ జట్టులో ఆయన స్థానంపై అనిశ్చితి కొనసాగుతోంది. ఇకపోతే జపాన్లో జరిగే ఏషియన్ గేమ్స్ 2026కు భారత జట్టు ప్రధాన కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నారు. ఆయనతో పాటు సునీల్ జోషి, హృషికేష్ కనిట్కర్, సుభాదీప్ ఘోష్ కోచింగ్ బృందంలో ఉంటారు. భేటీ అనంతరం గంభీర్, గిల్, అయ్యర్, లక్ష్మణ్ మీడియాకు ఎలాంటి ప్రకటన ఇవ్వకుండా వెనుదిరిగారు.
తాజావార్తలు
-
VVS Laxman: ముంబైలో బీసీసీఐ కీలక భేటీ.. వీవీఎస్ లక్ష్మణ్కు అదిరే శుభవార్త..
-
Imran Masood: ‘నా కూతురు 6 నెలలుగా ఇంట్లోనే ఉంది’.. అల్లుడు ఎస్పీలో చేరడంపై కాంగ్రెస్ ఎంపీ ఆవేదన
-
EPFO కొత్త పథకం.. 6 నెలలే అందుబాటులో ఉండే ఈ కొత్త స్కీమ్తో ఎవరికి లబ్ధి..? పూర్తి వివరాలు..
-
AP Cabinet Decisions: రైతులకు గుడ్న్యూస్.. అమరావతిపై ఫోకస్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Mallu Ravi : కొండా సురేఖ వ్యవహారంపై మల్లు రవి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!