BCCI: అప్పుడు తొలగించింది.. ఇప్పుడు మరలా అపాయింట్ చేసుకుంది!
- బీసీసీఐ కీలక నిర్ణయం
- ఫీల్డింగ్ కోచ్గా టి దిలీప్
- సంవత్సర కాలం పాటు జట్టుతో దిలీప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. గత సంవత్సరం న్యూజిలాండ్తో జరిగిన స్వదేశీ టెస్ట్ సిరీస్, ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో ఓటముల నేపథ్యంలో ఇద్దరు వీడ్కోలు పలికారు. ఈ రెండు సిరీస్ల అనంతరం ఆటగాళ్ల స్థాయిలోనే కాకుండా కోచింగ్ బృందంలో కూడా చాలా మార్పులు జరిగాయి. టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్లను గత నెలలో వారి పదవుల నుంచి బీసీసీఐ తొలగించింది. అయితే ఇప్పుడు బీసీసీఐ అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. దిలీప్ను తిరిగి ఇంగ్లండ్ పర్యటనకు ఫీల్డింగ్ కోచ్గా ఎంపిక చేసింది. ఓ సంవత్సర కాలం పాటు అతడు జట్టుతో ఉండనున్నాడు.
ప్రతిష్టాత్మక ఇంగ్లండ్ పర్యటన కోసం టి దిలీప్ను మరోసారి ఫీల్డింగ్ కోచ్గా బీసీసీఐ నియమించింది. ఫీల్డింగ్ కోచ్గా విదేశీయుడిని నియమించాలని బీసీసీఐ ప్రయత్నించనా.. అది కుదరలేదు. దాంతో భారత జట్టు సభ్యులతో మంచి అనుబంధం ఉన్న దిలీప్ను తిరిగి ఎంపిక చేసింది. ‘దిలీప్ మంచి కోచ్. అతను మూడు సంవత్సరాలకు పైగా (2021 నుండి) జట్టుకు సేవలు అందించాడు. ఆటగాళ్ల బలాబలాలు అతడికి బాగా తెలుసు. ఇంగ్లండ్తో జరిగే సిరీస్కు అతన్ని జట్టులో చేర్చుకోవడం మంచిది విషయం’ అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పుకొచ్చారు. నిజానికి జట్టులో దిలీప్ హయాంలో టీమిండియా ఫీల్డింగ్ ప్రమాణాలను బాగా మెరుగయ్యాయి.
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
టీమిండియా కొత్త టెస్ట్ కెప్టెన్గా శుభ్మాన్ గిల్ ఎంపికయిన విషయం తెలిసిందే. జూన్ 20 నుంచి ఇంగ్లండ్, భారత్ మధ్య ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ ఇప్పటికే జట్టును ప్రకటించింది. జూన్ 3న అహ్మదాబాద్లో జరిగే ఐపీఎల్ 2025 ఫైనల్కు గుజరాత్ అర్హత సాధిస్తే.. జూన్ 6 నుంచి ఇంగ్లండ్ లయన్స్తో జరిగే వార్మప్ మ్యాచ్కు శుభ్మాన్ గిల్, సాయి సుదర్శన్ అందుబాటులో ఉండరు. ఐపీఎల్ ఫైనల్ అనంతరం భారత జట్టు ఇంగ్లండ్ పయనమయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!