R.Krishnaiah : 42 శాతం ఇస్తే బీసీలకు న్యాయం జరగదు

  • బీసీలకు న్యాయం చేయాలంటే చట్టబద్ధత తప్పనిసరి
  • అఖిలపక్ష సమావేశంతో సామూహిక నిర్ణయం అవసరం
  • ఫిబ్రవరి 18న బీసీ సంఘాల నిరసన ప్రదర్శనలు : ఆర్.కృష్ణయ్య
R. Krishnaiah

R. Krishnaiah

R.Krishnaiah : పంచాయతీరాజ్ ఎన్నికల్లో పార్టీ పరంగా 42 శాతం కాదు, చట్ట ప్రకారం పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బిసి యువజన సంఘం అధ్యక్షుడు నీల వెంకటేష్ అధ్యక్షతన 14 బిసి సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ…. పంచాయతీరాజ్ ఎన్నికలలో బీసీలకు పార్టీ పరంగా 42 శాతం కోటా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో పార్టీ పరంగా 42 శాతం ఇస్తే బీసీలకు న్యాయం జరగదని అన్నారు. ఇతర పార్టీల వారు కూడా అంగీకరిస్తే అప్పుడు న్యాయం జరుగుతుందన్నారు. లేకపోతే అగ్రకులాలకు ఇస్తే డబ్బుతో పోటీ పడలేరని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఎలాంటి వివాదాలకు తావు లేకుండా అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లు 42 శాతంకు పెంచుతూ బిల్లు పెట్టి చట్టం చేయాలన్నారు. అప్పుడు అన్ని పార్టీలు కూడా బిసిలకు ఇస్తాయని, తద్వారా తప్పని సరిగ్గా బీసీలు గెలుస్తారన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 18న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనలు చేపట్టనున్నట్లు ఆర్ కృష్ణయ్య తెలిపారు.

Anji Reddy Chinnamile : కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు కల్పించిన తర్వాత ఓట్లు అడగాలి….