NTV Telugu Site icon

BC Janardhan Reddy: కాటసాని రామిరెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి ఆగ్రహం..!

Bc

Bc

ఎన్నికలకు ముందు నంద్యాల జిల్లా బనగానపల్లె నరియోజకవర్గంలో నివురుగప్పిన నిస్పులా సెగలు కక్కుతున్న రాజకీయం ఇప్పుడు మంటలు పుట్టిస్తొంది.. షాదీఖానా నిర్మాణం విషయంలో ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డికి మద్య జరుగుతున్న వార్‌ పీక్స్‌కు చేరింది.. సవాళ్లు, ప్రతిసవాళ్లతో బనగానపల్లె రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. షాదీఖానా విషయంలో ఇరువురు నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కొనసాగుతుంది.

Read Also: New Railway Line: తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. హైదరాబాద్- విజయవాడ తగ్గనున్న ప్రయాణ సమయం

గత కొన్నాళ్లుగా షాదీఖానా నిర్మాణం విషయంలో ఎస్‌ఆర్‌బీసీ బఫర్‌జోన్‌లో ఇళ్ల పట్టాల విషయంలో తనపై విమర్శలు చేస్తున్న వైసీనీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాజాగా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌‌లో ఆయన మాట్లాడుతూ.. షాదీఖానా నిర్మాణం విషయంలో బనగానపల్లె ముస్లింలకు కాటసాని రామిరెడ్డి చేస్తున్న మోసాన్ని సాక్ష్యాలతో సహా బయటపెట్టి.. తనపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టారు. బనగానపల్లె, కొలిమిగుండ్ల పట్టణాల్లో కమ్యూనిటీ హాళ్లకు శంకుస్థాపన చేసిన కాటసాని రామిరెడ్డి వాటిని షాదీఖానాలుగా పేర్కొంటూ ముస్లిం మత పెద్దలను కూడా మోసం చేస్తున్నారని బీసీ మండిపడ్డారు. ఈ మేరకు కమ్యూనిటీ హాళ్లకు సంబంధించిన ప్రభుత్వ జీవో ఉత్వర్తులను స్వయంగా ప్రెస్‌మీట్‌లో ప్రదర్శించిన బీసీ జనార్థన్ రెడ్డి షాదీఖానాలకు, కమ్యూనిటీ హాళ్లకు తేడా తెలియదా.. ఆ మాత్రం దిమాక్ లేదా అంటూ కాటసాని రామిరెడ్డిని టీడీజీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి కడిగిపారేసారు

Read Also: Telangana Budget 2024: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. Live & Update

గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బనగానపల్లెలో షాదీఖానా నిర్మాణం కోసం కోటి రూపాయలు మంజూరు చేయడంతో పాటు సొంతంగా 30 లక్షలు, కమీటీ ద్వారా మరో 25 లక్షలు సమకూర్చానన్నారు. కేవలం కక్ష సాధింపుతో ఆల్రెడీ 60 శాతం పనులు పూర్తి అయిన షాదీఖానాను కంప్టీల్ చేయలేదని కాటసానిపై ఆయన విరుచుకుపడ్డారు. తాను సొంత డబ్బులతో షాధీఖానాను పూర్తి చేయడానికి ముందుకు వస్తే తనపై అక్రమ కేసులు పెట్టించావని కాటసానిపై ఫైర్ అయ్యారు. తక్షణమే బనగానపల్లె నియోజకవర్గంలో ముస్లింలకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి క్షమాపణ చెప్పాలని బీసీ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తనపై లుచ్చా.. లోఫర్ అంటూ వ్యక్తిగత దూషణలకు పాల్పడిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డ తీరుపై బీసీ జనార్థన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బనగానపల్లె నియోజకవర్గంలో షాదీఖానాపై లోఫర్ రాజకీయం చేస్తున్న లుచ్చా రాజకీయ నాయకుడు నువ్వు అంటూ వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. త్వరలో నీ అవినీతి, అక్రమాలు అన్నింటిని బనగానపల్లె ప్రజల ముందు సాక్ష్యాధారాలతో సహా బయట పెడతానని ఈ సందర్భంగా కాటసాని రామిరెడ్డిని బీసీ జనార్థన్ రెడ్డి హెచ్చరించారు.