Haryana: అండర్పాస్ బ్రిడ్జి కింద నీటిలో కారు.. ఇద్దరు ఉద్యోగులు మృతి
- హర్యానాలోని ఫరీదాబాద్లో ఘోర ప్రమాదం
- అండర్పాస్లో నీరు నిలిచి ఉండటంతో అందులో ఇరుక్కుపోయిన ఎస్యూవీ
- బయటకు రాలేక కారులోనే ఉండటంతో ఊపిరాడక మృతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలోని ఫరీదాబాద్లో ఘోర ప్రమాదం జరిగింది. అండర్పాస్లో నీరు నిలిచి ఉండటంతో.. వారి ఎస్యూవీ అందులో ఇరుక్కుపోయింది. దీంతో వారు బయటకు రాలేక కారులోనే ఉండటంతో కారులో నీరు పోయి మరణించారని పోలీసులు శనివారం తెలిపారు. మృతులు ప్రైవేట్ బ్యాంకుకు చెందిన ఇద్దరు ఉద్యోగులు పుణ్యాశ్రయ్ శర్మ (48), విరాజ్ (26)గా గుర్తించారు. గురుగ్రామ్ నుండి గ్రేటర్ ఫరీదాబాద్లోని తమ ఇంటికి తిరిగి వస్తుండగా శుక్రవారం అర్థరాత్రి ఈ సంఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం కురిసిన వర్షం కారణంగా అండర్పాస్లో భారీగా నీరు నిలిచిందని, ముందుజాగ్రత్త చర్యగా అందులోకి కార్లు వెళ్లొద్దని హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు. అయితే.. రాత్రి 11:50 గంటల ప్రాంతంలో ఒక SUV 700.. అండర్పాస్లోకి ప్రవేశించి లోతైన నీటిలో చిక్కుకుందని, ఆ తర్వాత కారులోకి నీరు ప్రవేశించిందని పోలీసులు చెప్పారు. అయితే.. కారులో ఇరుక్కున్న ఇద్దరు వ్యక్తులను బాటసారులు ఆదుకునేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. చాలా ప్రయత్నాల తర్వాత వారిని బయటకు తీయగా.. అప్పటికే విరాజ్ మృతి చెందాడు. శర్మను ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు.
Also Read
- Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
- T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
- Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
- Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
Gyanvapi Mosque: “జ్ఞానవాపి మసీదు నిజానికి శివాలయమే”.. యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు..
మృతులిద్దరూ గురుగ్రామ్లోని సెక్టార్ -31లోని హెచ్డిఎఫ్సి బ్రాంచ్లో ఉద్యోగం చేస్తున్నారు. విరాజ్ ద్వివేది క్యాషియర్గా, పుష్యశ్రే శర్మ మేనేజర్గా ఉన్నారు. అండర్పాస్లో నీరు ఎక్కువగా ఉందని, దాని వల్లే కారు మునిగిపోయిందని ఈ విషయం తనకు తెలియదని మృతుడి సహచరుడు ఆదిత్య తెలిపాడు. విరాజ్ ను కారు నుంచి తీయడానికి ప్రయత్నించినప్పటికీ.. కారులోకి ఎక్కువ నీరు పోవడంతో డోర్లు లాక్ అయిపోయాయి. ఆ తర్వాత కారులో నీళ్లు నిండిపోవడంతో ఇద్దరూ చనిపోయినట్లు ఆదిత్య చెప్పాడు.
మరోవైపు.. అండర్పాస్లో బారికేడింగ్ లేదని ఆదిత్య తెలిపాడు. బారికేడింగ్లు ఉంటే బహుశా కారును అండర్పాస్లోకి తీసుకెళ్లి ఉండేవారు కాదన్నాడు. అయితే ఈ ఆరోపణలను పోలీసులు కొట్టిపారేశారు. రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఎస్హెచ్వో తెలిపారు. రైల్వే అండర్పాస్ దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామని.. ఈ మార్గంలో వెళ్లకుండా నిషేధం ఉందని పోలీసులు తెలిపారు. అయినప్పటికీ.. వారు అండర్పాస్ లోకి నీటిలో చిక్కుకుని చనిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
-
T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
-
Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!