Haryana: అండర్పాస్ బ్రిడ్జి కింద నీటిలో కారు.. ఇద్దరు ఉద్యోగులు మృతి
- హర్యానాలోని ఫరీదాబాద్లో ఘోర ప్రమాదం
- అండర్పాస్లో నీరు నిలిచి ఉండటంతో అందులో ఇరుక్కుపోయిన ఎస్యూవీ
- బయటకు రాలేక కారులోనే ఉండటంతో ఊపిరాడక మృతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలోని ఫరీదాబాద్లో ఘోర ప్రమాదం జరిగింది. అండర్పాస్లో నీరు నిలిచి ఉండటంతో.. వారి ఎస్యూవీ అందులో ఇరుక్కుపోయింది. దీంతో వారు బయటకు రాలేక కారులోనే ఉండటంతో కారులో నీరు పోయి మరణించారని పోలీసులు శనివారం తెలిపారు. మృతులు ప్రైవేట్ బ్యాంకుకు చెందిన ఇద్దరు ఉద్యోగులు పుణ్యాశ్రయ్ శర్మ (48), విరాజ్ (26)గా గుర్తించారు. గురుగ్రామ్ నుండి గ్రేటర్ ఫరీదాబాద్లోని తమ ఇంటికి తిరిగి వస్తుండగా శుక్రవారం అర్థరాత్రి ఈ సంఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం కురిసిన వర్షం కారణంగా అండర్పాస్లో భారీగా నీరు నిలిచిందని, ముందుజాగ్రత్త చర్యగా అందులోకి కార్లు వెళ్లొద్దని హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు. అయితే.. రాత్రి 11:50 గంటల ప్రాంతంలో ఒక SUV 700.. అండర్పాస్లోకి ప్రవేశించి లోతైన నీటిలో చిక్కుకుందని, ఆ తర్వాత కారులోకి నీరు ప్రవేశించిందని పోలీసులు చెప్పారు. అయితే.. కారులో ఇరుక్కున్న ఇద్దరు వ్యక్తులను బాటసారులు ఆదుకునేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. చాలా ప్రయత్నాల తర్వాత వారిని బయటకు తీయగా.. అప్పటికే విరాజ్ మృతి చెందాడు. శర్మను ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు.
Also Read
Gyanvapi Mosque: “జ్ఞానవాపి మసీదు నిజానికి శివాలయమే”.. యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు..
మృతులిద్దరూ గురుగ్రామ్లోని సెక్టార్ -31లోని హెచ్డిఎఫ్సి బ్రాంచ్లో ఉద్యోగం చేస్తున్నారు. విరాజ్ ద్వివేది క్యాషియర్గా, పుష్యశ్రే శర్మ మేనేజర్గా ఉన్నారు. అండర్పాస్లో నీరు ఎక్కువగా ఉందని, దాని వల్లే కారు మునిగిపోయిందని ఈ విషయం తనకు తెలియదని మృతుడి సహచరుడు ఆదిత్య తెలిపాడు. విరాజ్ ను కారు నుంచి తీయడానికి ప్రయత్నించినప్పటికీ.. కారులోకి ఎక్కువ నీరు పోవడంతో డోర్లు లాక్ అయిపోయాయి. ఆ తర్వాత కారులో నీళ్లు నిండిపోవడంతో ఇద్దరూ చనిపోయినట్లు ఆదిత్య చెప్పాడు.
మరోవైపు.. అండర్పాస్లో బారికేడింగ్ లేదని ఆదిత్య తెలిపాడు. బారికేడింగ్లు ఉంటే బహుశా కారును అండర్పాస్లోకి తీసుకెళ్లి ఉండేవారు కాదన్నాడు. అయితే ఈ ఆరోపణలను పోలీసులు కొట్టిపారేశారు. రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఎస్హెచ్వో తెలిపారు. రైల్వే అండర్పాస్ దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామని.. ఈ మార్గంలో వెళ్లకుండా నిషేధం ఉందని పోలీసులు తెలిపారు. అయినప్పటికీ.. వారు అండర్పాస్ లోకి నీటిలో చిక్కుకుని చనిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
AP Government: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 12 నుంచి ప్రారంభం..
-
PBKS Vs RCB: కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం.. భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ..
-
Taiwan: ‘‘మేము చైనా బానిసలం కాదు’’.. ట్రంప్ ప్రకటనపై తైవాన్ ఆగ్రహం..
-
Satish Kilaru: ఒకటి కాదు ఏకంగా మూడు గాయాలు.. ‘పెద్ది’ షూటింగ్లో చరణ్కు ఏమైందో చెప్పిన నిర్మాత!
-
Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..