Bangladesh: బంగ్లాదేశ్లో దుర్గాపూజ కోసం రూ.4 కోట్లు కేటాయించిన మహ్మద్ యూనస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత, నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ మహమ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం నడుస్తోంది. బుధవారం మహ్మద్ యూనస్ మాట్లాడుతూ భారత ప్రభుత్వంతో తమ ప్రభుత్వం సత్సంబంధాలను కోరుకుంటోందని అన్నారు. కానీ ఈ సంబంధం సమానత్వం, న్యాయబద్ధత ఆధారంగా ఉండాలి. కాగా, బంగ్లాదేశ్లోని దుర్గాపూజ కమిటీలకు మహ్మద్ యూనస్ ప్రభుత్వం రూ.4 కోట్లు కేటాయించింది. బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు డాక్టర్ ముహమ్మద్ యూనస్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ భారత్తో సహా ఇతర పొరుగు దేశాలతో సత్సంబంధాలను కోరుకుంటుందని, అయితే అది సమానత్వం, న్యాయబద్ధత ఆధారంగా ఉండాలని అన్నారు. పరిపాలనా సారథిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా పలు దేశాల నేతలు, పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ తనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారని మహ్మద్ యూనస్ తెలిపారు.
Read Also:Srisailam Project: కృష్ణమ్మ పరవళ్లు.. ఈ ఏడాది నాల్గోసారి శ్రీశైలం గేట్లు ఎత్తివేత..
Also Read
- Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Kanipakam Vinayaka Brahmotsavam 2026: కాణిపాక వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు.. ప్రత్యేక ఏర్పాట్లు
- Vinayaka Vrata Katha: 'వినాయక చవితి' నాడు విజ్ఞాలను తొలిగించే 'వినాయక వ్రత కథ' మీకోసం..!
బంగ్లాదేశ్లో హింసాత్మక ఉద్యమం తరువాత, షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి ప్రస్తుతం భారతదేశంలో ఆశ్రయం పొందారు. ఆమెను అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. వరదలను ఎదుర్కొనేందుకు బంగ్లాదేశ్తో భారత్తో ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు ప్రారంభించినట్లు మహ్మద్ యూనస్ తెలిపారు. దక్షిణాసియాలో ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించేందుకు సార్క్ను పునరుద్ధరించే ప్రయత్నాన్ని ఆయన ప్రారంభించారు. సార్క్లో భూటాన్, ఇండియా, మాల్దీవులు, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక ఉన్నాయి. బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ పూజ సమయంలో శాంతిభద్రతలను ఎలా నిర్వహించాలో.. భద్రతను ఎలా పెంచాలో ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఆర్థికంగా వెనుకబడిన ఆలయ కమిటీలకు ఈసారి ముఖ్య సలహాదారు నిధి నుంచి రూ.4 కోట్లకు పెంచినట్లు హోం వ్యవహారాల సలహాదారు, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ముహమ్మద్ జహంగీర్ ఆలం చౌదరి తెలిపారు. గతంలో కేటాయించిన దానికంటే ఇది దాదాపు రెట్టింపు అని తెలిపారు. పూజ వద్ద భద్రత కోసం తాత్కాలిక ప్రాతిపదికన వాలంటీర్లను నియమిస్తామని హోం సలహాదారు తెలిపారు. పూజా రోజుల్లో మైక్, ధాక్ లేదా ఇతర సంగీత వాయిద్యాల వినియోగాన్ని ఆజాన్కు కనీసం ఐదు నిమిషాల ముందు నిలిపివేయాలని ఆయన అన్నారు. ఆజాన్ ముగిసిన తర్వాత దీన్ని మళ్లీ ప్రారంభించవచ్చు. ఈసారి బంగ్లాదేశ్లోని దుర్గాపూజ మండపాల సంఖ్య దాదాపు 32 వేల వరకు ఉండే అవకాశం ఉంది. శాంతిభద్రతలు ఏ విధంగానూ క్షీణించకుండా చూసేందుకు పోలీసులకు అవసరమైన ఆదేశాలు ఇచ్చామని తాత్కాలిక ప్రభుత్వం తెలిపింది.
Read Also:IND vs BAN: భారత్-బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్లో ఈ రికార్డ్స్ బద్దలు కానున్నాయా..?
తాజావార్తలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
-
Hyderabad: దారుణం.. హైదరాబాద్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
-
Harmanpreet Kaur: మీరే మాకు అతిపెద్ద బలం, మీ కోసం ఏదైనా చేస్తాం.. హర్మన్ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
-
Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?