Krishna Mohan Reddy : “ఫొటో కల్లోలం: ఎమ్మెల్యేనా? పోస్టర్ స్టార్ నా?”
- కాంగ్రెస్కు తలనొప్పిగా మారిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యవహారం
- తాను పార్టీ మారలేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
- 6నెలల క్రితం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన కృష్ణమోహన్ రెడ్డి
- అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు ఎఫ్ఐఆర్ వ్యూహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krishna Mohan Reddy : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన ఫొటోను కాంగ్రెస్ ఫ్లెక్సీలపై చూసి హైరానా పడ్డారు. “ఏమిటీ! నా అనుమతి లేకుండా నా ఫొటో పెట్టారు? నా వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా చేశారు!” అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫ్లెక్సీలను చూసి బాధపడటమే కాక, వాటిని పెట్టిన వారిపై కేసులు కూడా నమోదయ్యాయని తెలుస్తోంది. “నేను కాంగ్రెస్ లో చేరానా, లేదా మరి ఫొటో మాత్రం చేరిపోయిందా?” అని ఆయన ముక్కు వేలేసుకుని గట్టిగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.
అయితే అసలు ట్విస్ట్ ఎక్కడుందంటే… ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ తలరాత మారిపోయినా, ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో ప్రత్యక్షమయ్యారు. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే! మరి ఇన్నాళ్లకు ఫ్లెక్సీ ఫిర్యాదు ఎందుకు? ఎక్కడో అనర్హత వేటుపడుతుందేమో అనే భయం బలంగా ఉండటంతో “నేను మారలేదు, నా ఫొటో మాత్రమే మారింది!” అని నిరూపించుకోవడానికి ఈ కొత్త “ఫ్లెక్సీ నాటకం” మొదలుపెట్టారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
కేటీఆర్ సెటైర్లు:
“ఇదేందయ్యా? మీ పార్టీ మారడం మాకు తెలియకపోవచ్చు, కానీ మీ ఫొటో మారిందన్న సంగతి కూడా తెలియదా?” ఈ కొత్త రాజకీయ నాటకంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్కడ మిస్ అవుతాడు? తనదైన సెటైరికల్ స్టైల్ లో, “అయ్యో పాపం! కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు ఇప్పుడు నోటిఫికేషన్ ఫొటోలా అయ్యారు.. అన్నీ రిజిస్టర్ అయినా ఫొటోలు మాత్రం మిస్ అయ్యాయి!” అంటూ ఘాటు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
“నేను ఎక్కడా చేరలేదు.. ఫ్లెక్సీలు వేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలి!” అంటూ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదును చూసి, “మీ పార్టీ మారిన వార్త కన్నా మీ ఫొటో పెట్టిన వార్త ఎక్కువ షాక్ ఇస్తోందయ్యా!” అని కేటీఆర్ చేతులు ఊపేస్తూ నవ్వారట.
ఇదంతా చూస్తుంటే.. ఓటర్లే కాదు, ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఎవరి పార్టీలో ఉన్నారో అర్థం కావడం లేదు. ఏదేమైనా.. ఓ పార్టీ ఫ్లెక్సీలో ఫొటో పెట్టినందుకు మరొక పార్టీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడం రాజకీయ చరిత్రలో ఇదే మొదటిసారి అయి ఉండొచ్చేమో! “రాజకీయాలు మారిపోవచ్చు.. పార్టీలు మారిపోవచ్చు.. కానీ ఫొటోలు మాత్రం అనుమతిని తీసుకుని మారాలి!” అంటూ ఇప్పుడు గద్వాల ప్రజలు చర్చించుకుంటున్నారు.
Mysterious Disease: కాంగోలో వింత వ్యాధి.. రెండ్రోజుల్లో 50 మంది మృతి
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..