Bandi Sanjay: కవిత పార్టీ పెట్టడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు.. ప్రజలకు ఉపయోగ పడితే ఆ ఆ పార్టీలను వారు స్వాగతిస్తారన్నారు. తాజాగా కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డిని విమర్శించారు. ముఖ్యమంత్రికి ఎన్నికల ముందు గుడ్లు గుర్తుకు వస్తాయి. గాడిద గుడ్లు అంటారు. ఎన్నికలు అయిపోయాక తొండలు గుర్తుకు వస్తాయి. తొక్కుడు గుర్తుకు వస్తుందన్నారు. కాళేశ్వరం గురించి ప్రస్తావిస్తూ.. ఆ ప్రాజెక్టును డిజైన్ చేసింది కేసీఆర్ ప్రభుత్వమే అన్నారు.. కాళేశ్వరం కూలిపోవడానికి అప్పుడున్న బీఆర్ఎస్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో కుమ్మక్కయ్యారని విమర్శించారు. రేవంత్రెడ్డి, కేసీఆర్లు కలిసే రాజకీయం చేస్తారని ఆరోపించారు. “ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణకి ముఖ్యమంత్రి.. ఉత్తరాది రాష్ట్రాల నాయకుడు కాదు. ముందు మీరు ప్రకటించిన మొదలు ఆరు గ్యారంటీలు అమలు చెయ్యాలి. కేంద్రం ఏమిస్తున్నదో తెలంగాణ ప్రజానీకానికి తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఖజానా పరిస్థితి బాగాలేదు.” అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
Bandi Sanjay: “ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు.. కానీ”.. కవిత పార్టీ పెట్టడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ రియాక్షన్..

Bandi