Bandi Bhageerath: బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం.. మరో సిట్ ఏర్పాటు!
- బండి భగీరథ్పై పోక్సో కేసు
- పోక్సో కేసు వ్యవహారంలో కీలక పరిణామం
- సోషల్ మీడియా పోస్టుల కేసులో సిట్ ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై పోక్సో చట్టం కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. పేట్ బషీర్ బాగ్ పోలీసు స్టేషన్లో అతడిపై కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. భగీరథ్పై లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఈ కేసులో భగీరథ్ కోసం పోలీసులు నాలుగు బృందాలు ఏర్పాటు చేసి ముమ్మర గాలింపు చేపట్టగా.. అతడు పోలీసుల ముందు లొంగిపోయాడు. తాజాగా భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
బండి భగీరథ్ పోక్సో వ్యవహారానికి సంబంధించిన సోషల్ మీడియా పోస్టుల కేసులో హైదరాబాద్ పోలీసులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన అనుచిత పోస్టులు, దుష్ప్రచారాలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తాజా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న దామోదర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇదే వ్యవహారంలో మరికొందరిపై కూడా కేసులు నమోదు చేసినట్లు సమాచారం. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం, న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
Also Read
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
- Tollywood : అటు నందమూరి.. ఇటు మెగా.. ముహూర్తం పెట్టేసారు
కేసు దర్యాప్తు కోసం జాయింట్ సీపీ శ్వేత ఆధ్వర్యంలో ప్రత్యేక సిట్ను ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా ద్వారా వైరల్ అయిన పోస్టులు, వాటి మూలాలు, ప్రచారం చేసిన వ్యక్తుల వివరాలు, కుట్ర కోణం వంటి అంశాలపై సిట్ లోతుగా విచారణ చేపట్టనుంది. విచారణలో భాగంగా.. బండి భగీరథ్కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే సంబంధిత జడ్జి భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ పదవి ఇస్తారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగినట్లు గుర్తించారు. ఈ ప్రచారంపై హైకోర్టు రిజిస్ట్రార్ మే 16న చార్మినార్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఈ కేసును చార్మినార్ పోలీసులు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. సోషల్ మీడియా పోస్టుల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు. తాజాగా సిట్ ఏర్పాటు కావడంతో ఈ కేసు దర్యాప్తు మరింత వేగంగా సాగనున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
-
Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
-
Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
-
RCB Physiotherapist: ఆర్సీబీ ఫిజియోథెరపిస్ట్ స్టోరీ అంతా డూపే.. హేజిల్వుడ్, లివింగ్స్టోన్ ఏం చేయలేదు!
-
Sara Ali Khan: తల్లిదండ్రుల విడాకుల ప్రభావం.. పెళ్లిపై సారా సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!