Masala ban: ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాలపై రిపోర్టు కోరిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాలపై విదేశాల్లో నిషేధం కొనసాగుతోంది. అంతేకాకుండా వాటి ఉత్పత్తులను తిరిగి ఇండియాకు పంపేయాలని ప్రభుత్వాలు ఆదేశించాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తం అయింది. నిషేధం వెనుక ఉన్న వివరాలను అందజేయాలని కేంద్ర వాణిజ్య శాఖ సింగపూర్, హాంకాంగ్ ఎంబసీలను కోరింది.
ఇటీవల ఎవరెస్ట్ మసాలాలో పురుగుల మందు అవశేషాలు ఉన్నట్లుగా సింగపూర్ ప్రభుత్వం గుర్తించింది. దీంతో వాటి ఉత్పత్తులను తిరిగి ఇండియాకు పంపేయాలని ఆదేశించింది. అనంతరం ఎండీహెచ్ సాంబార్ మసాలాలో కూడా కేన్సర్ కారకాలు ఉన్నట్లుగా తేలింది. దీంతో ఎండీహెచ్ మసాలాపై హాంకాంగ్ ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో ఈ రెండు ఉత్పత్తులపై భారత ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే వీటి ఉత్పత్తులపై వివరాలు సేకరించింది. తాజాగా ఆ రెండు దేశాల నుంచి కూడా వివరాలు సేకరించే పనిలో పడింది. ఈ రెండింటిలో తేలిన అవశేషాలకు సంబంధించి వివరణాత్మక నివేదికను పంపాలని భారత రాయబార కార్యాలయాలను కేంద్ర వాణిజ్య శాఖ ఆదేశించింది. దీంతో సింగపూర్, హాంకాంగ్ ఆహార భద్రతా నియంత్రణ సంస్థల నుంచి భారత ఎంబసీ వివరాలు సేకరిస్తోంది.
Also Read
ఇది కూడా చదవండి: Prathinidhi 2: ప్రతినిధి 2 మూవీ రిలీజ్ వాయిదా..
ప్రపంచంలోనే ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాలకు మంచి ఉత్పత్తులు ఉన్నాయి. ఇండియా నుంచి ఎక్కువగా ఈ మసాలాలు ఎగుమతి అవుతుంటాయి. అయితే ఇటీవల జరిగిన మెడికల్ టెస్టుల్లో మసాలాల్లో పరిమితులకు మించి ‘ఇథిలీన్ ఆక్సైడ్’ అనే క్రిమిసంహారకాలు ఉన్నట్లుగా ప్రభుత్వాలు గుర్తించాయి. దీంతో ఈ రెండు ఉత్పత్తులను ఆయా దేశాలు నిషేధం విధించాయి.
ఇది కూడా చదవండి: Allari Naresh : ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఆ సినిమా చేసాను..
ఇదిలా ఉంటే ఇప్పటికే ఆయా కంపెనీల నుంచి వివరాలు కోరినట్లు కేంద్ర వాణిజ్య శాఖ అధికారి తెలిపారు. ఈ మసాలాలపై నిషేధం వెనుక ఉన్న మూల కారణాలపై దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లుగా పేర్కొన్నారు. రిపోర్టులు అందగానే ఎగుమతిదారులతో చర్చిస్తామని చెప్పారు. సింగపూర్ మరియు హాంకాంగ్లోని రాయబార కార్యాలయాల నుంచి వివరాలు కోరినట్లు అధికారి తెలిపారు. మసాలా రవాణాలో ఇథిలీన్ ఆక్సైడ్ను తప్పనిసరిగా పరీక్షించే అంశంపై చర్చించడానికి పరిశ్రమలతో సంప్రదింపులు జరగనున్నాయని మంత్రిత్వ శాఖ అధికారి పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఎవరెస్ట్, ఎండీహెచ్ సాంబార్ మసాలాలను కొనుగోలు చేయొద్దని ఇప్పటికే సింగపూర్, హాంకాంగ్ ప్రజలకు ప్రభుత్వాలు విజ్ఞప్తి చేశాయి. అంతేకాకుండా వ్యాపారులు కూడా వాటిని విక్రయించొద్దని కూడా ఆదేశించాయి. ఆ ఉత్పత్తులను ఇండియాకు తిరిగి పంపేయాలని కూడా ఫుడ్ ఏజెన్సీలకు సూచించాయి.
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..