Balka Suman : దళితలకు సమాన హక్కు కోసమే దళిత బంధు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎస్సీలలో పేదరికాన్ని రూపుమాపడంతోపాటు వారు ఇతరులతో సమానంగా ఎదగాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ (డీఎస్ఎస్) భవన్లో ఉత్తరప్రదేశ్ సామాజిక కార్యకర్త రాఘవేంద్రకుమార్, వివిధ రాష్ర్టాల రైతు సంఘాల ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సుమన్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎవరూ ప్రత్యేకంగా దళిత బంధు పథకాన్ని తీసుకురాలేదన్నారు. ముఖ్యమంత్రితో సమావేశానికి హాజరయ్యేందుకు రాఘవేంద్రకుమార్, రైతు సంఘాల ప్రతినిధులు నగరానికి వచ్చారు. దళిత బంధు పథకం తెలంగాణలో మాత్రమే అమలవుతుందని, రూ.3,600 కోట్లతో ఇప్పటి వరకు 30 వేల యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయని సుమన్ తెలిపారు.
Also Read
- Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ.17,700 కోట్లు కేటాయించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని దాదాపు 19 లక్షల కుటుంబాలు దశలవారీగా లబ్ది పొందుతాయన్నారు. ఎస్సీల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి 30 ఏళ్ల క్రితం సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ‘దళిత చైతన్య జ్యోతి’ పథకాన్ని ప్రవేశపెట్టారు. రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలకు చెందిన 70 మంది దళిత బంధు లబ్ధిదారులు ఈ పథకాన్ని వినియోగించుకున్న తర్వాత తమ జీవితాలు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. ప్రస్తుతం జీవితంలో ఆర్థికంగా స్థిరపడగలుగుతున్నామని లబ్ధిదారులు తెలిపారు. ఈ సందర్భంగా రాఘవేంద్రకుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేపట్టిన చొరవ అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ ఎస్సీల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు.
తాజావార్తలు
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!