Bajrang Punia: “కాంగ్రెస్ని వదిలిపెట్టండి. లేదంటే”.. బజరంగ్ పూనియాకు బెదిరింపు మెసేజ్
- బజరంగ్ పునియాకు విదేశీ నంబర్ నుంచి హత్య బెదిరింపు
- వాట్సాప్లో బెదిరింపు సందేశం
- కుటుంబానికి కూడా మంచిది కాదని పేర్కొన్న ఆగంతకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని ప్రముఖ రెజ్లర్, ఇటీవల కిసాన్ కాంగ్రెస్ వర్కింగ్ ఛైర్మన్ అయిన బజరంగ్ పునియాకు విదేశీ నంబర్ నుంచి హత్య బెదిరింపు వచ్చింది. కాంగ్రెస్లో చేరిన తర్వాత ఆయనకు వాట్సాప్లో బెదిరింపు సందేశం వచ్చింది.. ‘బజరంగ్, కాంగ్రెస్ని వీడి వెళ్లండి.. లేకపోతే మీకు, మీ కుటుంబానికి మేలు జరగదు.. ఇదే మా చివరి సందేశం.. ఎన్నికలకు ముందు మా సంగతి ఏంటో చూపిస్తాం. మీకు కావలసిన చోట ఫిర్యాదు చేయండి. ఇది మా మొదటి, చివరి హెచ్చరిక.” అని రాశారు. ఈ బెదిరింపు తర్వాత బజరంగ్ సోనిపట్ బహల్ఘర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న పోలీలు విచారణ ప్రారంభించారు. జాతీయ క్రీడాకారుడు, ప్రజలలో పేరుగాంచిన బజరంగ్ కి ఇలాంటి మెసేజ్ రావడంపై ప్రజల్లో ఆందోళన, ఆగ్రహాన్ని సృష్టించింది.
READ MORE: Minister Kollu Ravindra: రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి కొల్లు రవీంద్ర
Also Read
- Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
- Rangasamy: ఐదవసారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం..!
- Gold Sales Decline: పడిపోయిన బంగారం అమ్మకాలు.. కళకళలాడాల్సిన సమయంలో వెలవెలబోతున్న షాపులు
- Prateek Yadav: అఖిలేష్ యాదవ్ తమ్మడు 'ప్రతీక్ యాదవ్' మృతి..!
బజరంగ్ పునియాకు భద్రతా ఏర్పాట్లు..
ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నామని, బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని గుర్తించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు. భజరంగ్, ఆయన కుటుంబ సభ్యుల భద్రత కోసం పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యక్తికి ఇలాంటి ముప్పు రావడం ఇదే మొదటిసారి కాదు. అయితే.. ఈ మెసేజ్ తో పూనియా ప్రాణాలకు ప్రమాదం రావొచ్చనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ బెదిరింపు తర్వాత.. బజరంగ్ పునియా భద్రతపై దృష్టి పెట్టారు. భద్రతను పెంచారు.
READ MORE:UP News: మహిళా లాయర్పై సమాజ్వాదీ పార్టీ నాయకుడి అత్యాచారం..
కాగా.. ప్రముఖ రెజర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. హర్యానా ఎన్నికల నేపథ్యంలో వీరి చేరిక కాంగ్రెస్కి కీలకంగా మారింది. వచ్చే నెల తొలివారంలో హర్యానా అసెంబ్లీలోని 90 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. వరసగా రెండుసార్లు అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుంటే, ఈ సారి ఎలాగైనా హర్యానాని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీని కోసం ఏ అవకాశాన్ని వదిలేయొద్దని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫోగట్, పునియాలను చేర్చుకుంది.
తాజావార్తలు
-
iBomma : ఐబొమ్మ మళ్లీ యాక్టివ్.. కొత్త సినిమాలతో సడెన్ ఎంట్రీ!
-
Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
-
Jailer 2: ‘జైలర్ 2’ ఇప్పట్లో రానట్టేనా?
-
RCB vs KKR: మాపై కోహ్లీ దూకుడుగా ఆడాలని కోరుకుంటున్నా.. కేకేఆర్ కోచ్ వాట్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rangasamy: ఐదవసారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం..!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!