Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Badi Bata Progran Taking New Decisions In Telangana State Wise

Badi Bata: సరికొత్త ప్రచారం దిశగా బడిబాట..

Published Date :June 7, 2024 , 5:03 pm
By Kothuru Ram Kumar
Badi Bata: సరికొత్త ప్రచారం దిశగా బడిబాట..
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గురువారం నటి నుండి బడిబాట కార్యక్రమం మొదలయింది. జూన్ 19 వరకు కొనసాగనున్న ఈ బడిబాటలో భాగంగా.. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో చదివితే వచ్చే విద్యా, ఆపై అవకాశాలపై తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించబోతున్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా జూన్ 12న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కూళ్లను పున:ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సరికొత్త ప్రచారం షురూ చేయనున్నారు అధికారులు. ఈ ప్రచారాన్ని అమ్మ కమిటీలకే బాగోగులు, బాధ్యతలను అప్పగించారు. ప్రైవేటు మోజు నుంచి తల్లిదండ్రుల్లో మార్పు తెచ్చే ప్రయత్నం చేయనున్నారు.

Top Headlines @ 5PM : టాప్‌ న్యూస్

ఇక ఈ కార్యక్రమంలో అనేక అంశాలను అధికారులు ప్రచారం చేయనున్నారు. అవేమంటే.. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం తీసుకురావడం., విద్యార్థుల నమోదు శాతం పెంచటం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమం చేపట్టింది. ఈసారి ప్రభుత్వం వినూత్నంగా ప్రచారం ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను పిల్లలకు అందించాలని తల్లిదండ్రులను చైతన్యవంతులను చేస్తోంది. ప్రైవేటు స్కూల్స్ లో చేరితే రూ.50 వేల నుంచి రూ 1.50 లక్షల వరకు ఖర్చవుతుందని.., ఇప్పుడు ఆదా చేసే డబ్బును మీ పిల్లల ఉన్నత చదువులకు పొదుపు చేయమంటూ సరికొత్తగా ప్రచారం చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రైవేటు పై మోజు తగ్గించేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా తల్లిదండ్రుల్లో మార్పు తీసుకురావాలని ప్రయత్నాలు ప్రారంభించింది.

రాష్ట్రమంతటా ప్రతి పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసింది. వీటి అధ్వర్యంలో అన్ని పాఠశాలలను కొత్త హంగులతో తీర్చిదిద్దుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌, తెలుగు మీడియంలో విద్యాబోధనతోపాటు విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం అందిస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఒక జత షూస్‌ను ఉచితంగా అందిస్తోంది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 6వ తేదీ నుంచి మొదలైన బడిబాట ఈనెల 19వ తేదీ వరకు చేపడుతారు. బడీడు పిల్లలను, బడిమానేసిన విద్యారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు అమ్మ ఆదర్శ కమిటీలతోపాటు, విద్యా శాఖాధికారులు, హెడ్మాస్టర్లు, యువజన సంఘాలు, ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. ఇదే బడిబాట సందర్భంగా.. ప్రైవేటు స్కూళ్లపై మోజు తగ్గించి.. ప్రభుత్వ పాఠశాలల పునర్వైభవానికి కృషి చేసేలా విస్తృత ప్రచారం చేపట్టాలని, తల్లిదండ్రుల్లో మార్పు తెచ్చేందుకు ప్రయత్నం జరగాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్​ రెడ్డి విద్యాశాఖ అధికారులకు, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

EVM: ‘‘ వాటికి ఇప్పుడు విశ్రాంతినివ్వండి.. వచ్చే ఎన్నికల్లో తిట్టండి’’..ఈవీఎంలను నిందించడంపై సీఈసీ సెటైర్లు..

పాఠశాలల బాగోగులు, బాధ్యతలను అమ్మ కమిటీలకు అప్పగించటం ద్వారా ఈ విద్యా సంవత్సరంలో ఆశించిన స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 26,823 పాఠశాలల్లో 20,680 చోట్ల ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలను ఏర్పాటు చేశారు. 17,729 పాఠశాలల్లో అవసరమైన పనులన్నీ ఈ కమిటీలకు అప్పగించారు. పాఠశాలల్లో తలుపులు, కిటికీలు, బ్లాక్ బోర్డులు, ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డులు, ఫ్యాన్లు, మరుగుదొడ్ల తాత్కాలిక మరమ్మతుల పనులన్నింటినీ ప్రభుత్వం ఈ సారి వేసవిలోనే మొదలు పెట్టింది. ఈ పనులకు రూ.667.25 కోట్లు కేటాయించింది. అందులో ఇప్పటికే రూ.147 కోట్లు కమిటీలకు అడ్వాన్సుగా కూడా చెల్లించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • badi bata
  • revanth reddy
  • telangana state
  • telangana state government schools
  • tlangana

తాజావార్తలు

  • Chairmans Desk: ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ కు కలిగిన నష్టమేంటి..? అమెరికా స్నేహం ఎలా కొంప ముంచింది.?

  • Ustaad Bhagat Singh : పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ ధరలు పెంపు లేదు.!

  • Cyber Crime : ‘స్టాక్ మార్కెట్ మాయ’ ఒక్క క్లిక్‌తో 24 లక్షలు ఫట్..!

  • Off The Record: పవన్‌ కల్యాణ్‌ మనసు మార్చుకున్నారా..? రీ థింకింగ్‌లో పడ్డారా..?

  • RRB Jobs: రైల్వే శాఖలో 11,127 ఉద్యోగాలు.. మే 15 నుంచి దరఖాస్తులు..

ట్రెండింగ్‌

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions