Ayodhya Airport : 20 నెలల్లో పూర్తయిన అయోధ్య విమానాశ్రయం… దాని ప్రత్యేకతలివే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Airport : ప్రస్తుతం ఎవరి నోట విన్నా అయోధ్య గురించే చర్చ నడుస్తోంది. వచ్చే నెలలో రామమందిరాన్ని ప్రారంభం, రామ్లాలా ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఇవి ఇలా ఉండగా నేడు ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య పర్యటనలో ఉన్నారు. ఈరోజు ఆయన ఇక్కడ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ప్రారంభించాల్సిన విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టారు. ఈ విమానాశ్రయం అయోధ్యను ప్రపంచంతో కలుపుతుంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ 20 నెలల్లో విమానాశ్రయాన్ని నిర్మించామని, ఇది చారిత్రాత్మకమని చెప్పారు. గతేడాది ఏప్రిల్ నెలలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఒక MOU కుదిరింది. విమానాశ్రయం నిర్మాణానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 821 ఎకరాల భూమిని అందించింది.
Read Also:Nandyal: జీవితఖైదు అనుభవిస్తూ చదువులో రాణించిన ముద్దాయి.. పీజీలో గోల్డ్ మెడల్..
Also Read
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
- Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
- Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. 'ఆరెంజ్ క్యాప్' విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
‘వాణిజ్యం పర్యాటకం పెరుగుతుంది’
విమానాశ్రయం నిర్మాణంతో రామాలయానికి వచ్చే భక్తులకు రవాణా సౌకర్యం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయోధ్యలో రామ మందిరంతో పాటు మతపరమైన ప్రాముఖ్యత ఉన్న అనేక ఇతర ప్రదేశాలు ఉన్నాయి. అయోధ్యలో హిందూ మతాన్ని విశ్వసించే వారికి రామ్ కీ పైడి, హనుమాన్ గ్రాహి, నాగేశ్వర్ నాథ్ ఆలయం, బిర్లా ఆలయం గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఈ ప్రదేశాలను సందర్శించాలనుకునే వారికి కొత్త విమానాశ్రయం మంచి ఎంపిక. దీనివల్ల వాణిజ్యం, పర్యాటకం కూడా ఊపందుకుంటాయని అంచనా.
అయోధ్య: విమానాశ్రయం ప్రత్యేకత
విమానాశ్రయం రన్వే పొడవు 2200 మీటర్లు. ఈ విమానాశ్రయం A-321 రకం విమానాలను కూడా ఆపరేట్ చేయగలదు. టాక్సీ స్టాండ్తో పాటు విమానాశ్రయం సమీపంలో కూడా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయం రెండో దశ ఇంకా విస్తరించాల్సి ఉంది. రెండో దశలో 50,000 చదరపు మీటర్ల కొత్త టెర్మినల్ భవనాన్ని నిర్మించాల్సి ఉంది. దీని తరువాత, ఈ విమానాశ్రయం రద్దీ సమయాల్లో గరిష్టంగా 4,000 మంది ప్రయాణికులకు సేవలను అందించగలదు. అలాగే, రెండవ దశ పూర్తయిన తర్వాత ప్రతి సంవత్సరం 60 లక్షల మంది అయోధ్య విమానాశ్రయాన్ని సందర్శించగలరు.
తాజావార్తలు
-
Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
The Paradise: నానీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!