Ayodhya Airport : 20 నెలల్లో పూర్తయిన అయోధ్య విమానాశ్రయం… దాని ప్రత్యేకతలివే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Airport : ప్రస్తుతం ఎవరి నోట విన్నా అయోధ్య గురించే చర్చ నడుస్తోంది. వచ్చే నెలలో రామమందిరాన్ని ప్రారంభం, రామ్లాలా ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఇవి ఇలా ఉండగా నేడు ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య పర్యటనలో ఉన్నారు. ఈరోజు ఆయన ఇక్కడ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ప్రారంభించాల్సిన విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టారు. ఈ విమానాశ్రయం అయోధ్యను ప్రపంచంతో కలుపుతుంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ 20 నెలల్లో విమానాశ్రయాన్ని నిర్మించామని, ఇది చారిత్రాత్మకమని చెప్పారు. గతేడాది ఏప్రిల్ నెలలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఒక MOU కుదిరింది. విమానాశ్రయం నిర్మాణానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 821 ఎకరాల భూమిని అందించింది.
Read Also:Nandyal: జీవితఖైదు అనుభవిస్తూ చదువులో రాణించిన ముద్దాయి.. పీజీలో గోల్డ్ మెడల్..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
‘వాణిజ్యం పర్యాటకం పెరుగుతుంది’
విమానాశ్రయం నిర్మాణంతో రామాలయానికి వచ్చే భక్తులకు రవాణా సౌకర్యం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయోధ్యలో రామ మందిరంతో పాటు మతపరమైన ప్రాముఖ్యత ఉన్న అనేక ఇతర ప్రదేశాలు ఉన్నాయి. అయోధ్యలో హిందూ మతాన్ని విశ్వసించే వారికి రామ్ కీ పైడి, హనుమాన్ గ్రాహి, నాగేశ్వర్ నాథ్ ఆలయం, బిర్లా ఆలయం గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఈ ప్రదేశాలను సందర్శించాలనుకునే వారికి కొత్త విమానాశ్రయం మంచి ఎంపిక. దీనివల్ల వాణిజ్యం, పర్యాటకం కూడా ఊపందుకుంటాయని అంచనా.
అయోధ్య: విమానాశ్రయం ప్రత్యేకత
విమానాశ్రయం రన్వే పొడవు 2200 మీటర్లు. ఈ విమానాశ్రయం A-321 రకం విమానాలను కూడా ఆపరేట్ చేయగలదు. టాక్సీ స్టాండ్తో పాటు విమానాశ్రయం సమీపంలో కూడా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయం రెండో దశ ఇంకా విస్తరించాల్సి ఉంది. రెండో దశలో 50,000 చదరపు మీటర్ల కొత్త టెర్మినల్ భవనాన్ని నిర్మించాల్సి ఉంది. దీని తరువాత, ఈ విమానాశ్రయం రద్దీ సమయాల్లో గరిష్టంగా 4,000 మంది ప్రయాణికులకు సేవలను అందించగలదు. అలాగే, రెండవ దశ పూర్తయిన తర్వాత ప్రతి సంవత్సరం 60 లక్షల మంది అయోధ్య విమానాశ్రయాన్ని సందర్శించగలరు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!