AUS vs IND: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. కోచ్ గంభీర్కు హర్భజన్ కీలక సూచన!
- నవంబర్ 22 నుంచి మొదటి టెస్ట్ ఆరంభం
- వ్యూహాలను సిద్ధం చేస్తున్న గౌతమ్ గంభీర్
- గంభీర్కు హర్భజన్ కీలక సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 నవంబర్ 22న ప్రారంభం అవనుంది. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య నవంబర్ 22 నుంచి మొదటి టెస్ట్ ఆరంభం అవుతుంది. న్యూజీలాండ్ చేతిలో దారుణ ఓటమి నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ సహా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు కీలకంగా మారింది. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలన్నా.. ఆస్ట్రేలియాపై సిరీస్ను 4-0తో కైవసం చేసుకోవాలి. ఆసీస్ జట్టుపై గెలుపు కోసం గౌతీ వ్యూహాలను సిద్ధం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. గంభీర్కు కీలక సూచన చేశాడు. ఆసీస్ గడ్డపై భారత్ మెరుగైన ప్రదర్శన చేయాలంటే.. కోచ్ గంభీర్ ప్రశాంతంగా ఉండాలని సూచించాడు.
స్పోర్ట్స్ జర్నలిస్ట్ జతిన్ సప్రూ యూట్యూబ్ ఛానెల్లో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ… ‘భారత్ లాంటి టాప్ జట్లకు కోచ్గా ఉండటం చాలా కష్టం. ఎవరైనా కుదురుకోవడానికి సమయం తీసుకుంటారు. ఫలితాలు బాగా వస్తే.. గంభీర్ టీమ్ని గెలిపిస్తున్నాడని అందరూ అంటారు. లేదంటే విమర్శలు చేస్తారు. ఆస్ట్రేలియాతో సిరీస్ ముఖ్యమైనది. చాలా అంశాలు పరీక్ష పెడుతాయి. గౌతీ కోపం, సహనాన్ని ఈ సిరీస్ పరీక్షిస్తుంది. గంభీర్ తన కోపాన్ని నియంత్రించుకోలేడు. ఇలా చేస్తే సీనియర్ ప్లేయర్స్ విసుగు చెందుతారు. కోపాన్ని నియంత్రించుకునే టెస్టులో గంభీర్ పాస్ కావాలి’ అని అన్నాడు.
Also Read
- Fraud: రూ.1700 కోట్ల నకిలీ జీఎస్టీ కుంభకోణం బట్టబయలు.. ప్రధాన సూత్రధారి అరెస్ట్..
- LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
- Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
- NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
Also Read: PL 2025 Auction: డబ్బు మ్యాటర్ కాదు.. ఢిల్లీని వీడటంపై స్పందించిన పంత్!
‘గౌతమ్ గంభీర్కు ఆస్ట్రేలియా పర్యటన చాలా కీలకం. ప్రతిఒక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ప్రస్తుతం మాత్రం అందరి దృష్టి గౌతీపైనే ఉంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా మెరుగ్గా ఆడకపోతే.. గంభీర్ అయిపోతాడు. విమర్శకులకు అతడు లక్ష్యంగా మారతాడు. గౌతీ ప్రశాంతంగా ఉండాలని, భారత జట్టు బాగా ఆడాలని నేను కోరుకుంటున్నా’ అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. గత రెండు పర్యాయాలు ఆసీస్ గడ్డపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇక హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. ఈసారి ఎలాగైనా సిరీస్ కాపాడుకోవాలని ఆసీస్ చూస్తోంది.
తాజావార్తలు
-
Fraud: రూ.1700 కోట్ల నకిలీ జీఎస్టీ కుంభకోణం బట్టబయలు.. ప్రధాన సూత్రధారి అరెస్ట్..
-
Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
-
LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
-
Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!