NTV Telugu Site icon

Aurobindo Pharma: సీఎం సహాయనిధికి అరబిందో ఫార్మా రూ.5 కోట్ల విరాళం

Aurobindo Pharma

Aurobindo Pharma

Aurobindo Pharma: తెలంగాణలో వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధికి అరబిందో ఫార్మా రూ.5కోట్లు విరాళంగా అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం, డిప్యూటీ సీఎంలకు అరబిందో ఫార్మా వైస్ ప్రెసిడెంట్&ఎండీ కె.నిత్యానంద రెడ్డి, కంపెనీ డైరెక్టర్ మదన్ మోహన్ రెడ్డి, తదితరులు రూ. 5 కోట్ల చెక్కును అందజేశారు.

Read Also: SBI Donations: సీఎం సహాయనిధికి ఎస్‌బీఐ ఉద్యోగుల ఒకరోజు వేతనం విరాళం

తెలంగాణలో గత వారం రోజులుగా కుండపోత వర్షాలు విలయతాండవం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. తెలంగాణలోని ఖమ్మం జిల్లాను వరద ముంచెత్తింది. ఈ నేపథ్యంలో వరద బాధితుల కోసం ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టినప్పటికీ ఇంకా పరిస్థితులు పూర్తిగా సర్దుకోలేదు. ఇదిలా ఉండగా.. పలు రంగాల్లోని ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, ఉద్యోగులు ప్రభుత్వానికి విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా ఈ రోజు ఎస్బీఐ ఉద్యోగులు, అరబిందో ఫార్మా యాజమాన్యం రూ.5 కోట్ల చొప్పున విరాళాలు అందించారు.