ప్రస్తుతం సోషల్ మీడియా అయ్యయ్యే వద్దమ్మా.. సుఖీభవ.. సుఖీభవ.. అంటూ ఓ వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని నల్లగుట్ట శరత్ అనే యువకుడు ఓ టీ పౌడర్ యాడ్ ను రీ క్రియేట్ చేసి.. తన దైన స్టైల్ లో తీన్మార్ స్టెప్పులు వేయడంతో ఈ సుఖీభవ.. సుఖీభవ.. అనే వీడియో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో వైరల్ గా మారడంతో ఒక్క సారిగా ఫేమస్ అయిన ఈ నల్లగుట్ట శరత్ పైన దాడి జరిగింది. శరత్ తీవ్ర గాయాలతో ఉన్న ఫోటోలు కొన్ని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలో శరత్ ముక్కు, నోట్లో నుంచి రక్తం కారుతోంది. ఎదో ఫంక్షన్ లో గొడవ జరిగిందని… అక్కడ శరత్ పైన దాడి జరిగినట్లు గా తెలుస్తోంది. దీనిపైన ఇక క్లారిటీ రాలేదు.