Archana Gautam: కాంగ్రెస్ కార్యాలయం బయట జరిగిన దాడి అత్యాచారం కంటే తక్కువేం కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయం బయట మూడ్రోజుల క్రితం బిగ్బాస్-16 ఫేమ్ మోడల్, నటి అర్చన గౌతంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె ఎట్టకేలకు నోరు విప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీని కలిసేందుకు తండ్రితో కలిసి ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లానని ఆమె తెలిపారు. వారిని అభినందించడానికే అక్కడికి వెళ్లినట్లు పేర్కొ్న్నారు. అయితే అక్కడ తమకు ఘోర అవమానం జరిగినట్లు అర్చన పేర్కొన్నారు. అక్కడ వారిపై భౌతిక దాడి కూడా జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి.
Also Read: ICC World Cup 2023: ప్రపంచకప్లో టీమిండియాను ఓడించని జట్లు ఇవే.. లిస్టులో పాకిస్తాన్ కూడా!
Also Read
- 7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
- Trent Boult విధ్వంసం.. యార్కర్తో బెయిర్స్టోకు షాక్.! 'బై-బై' సెలబ్రేషన్ వీడియో వైరల్.!
- Telangana High Court: "సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా".. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
ఇక ఈ విషయం గురించి ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడిన అర్చన అక్కడ ఉన్న వారు తమని లోపలి వెళ్లనివ్వకుండా గేట్లు మూసే ఉంచారన్నారు. తమని లోపలికి రానివ్వకుండా వారికి ఆదేశాలు ఉన్నాయని అక్కడి వారు పేర్కొన్నట్లు అర్చన తెలిపారు. అయితే అందుకు గల కారణాలు తెలియదు అని పేర్కొన్న బ్యూటీ, బిగ్బాస్ ముగిసినప్పటి నుంచి కార్యాలయానికి వెళ్లలేదు కాబట్టి తనకి మంచి స్వాగతం లభిస్తుందని ఆశించినట్లు పేర్కొంది. తన డ్రైవర్ తలకు గాయం అయ్యిందని, ఈ ఘటనలో తన తండ్రి తలకు కూడా గాయం అయినట్లు పేర్కొంది.
అయితే తనకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపిన ముందుగుమ్మ త్వరలోనే మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు వెల్లడిస్తానని పేర్కొంది. అయితే ఈ విషయాలు ప్రియాంకగాంధీకి, రాహుల్ గాంధీకి ఇంకా తెలియవని తాను అనుకుంటున్నట్లు తెలిపిన అర్చన వారి నుంచి ఫోన్ వస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. ప్రియాంక నుంచి ఫోన్ రాకపోతే తనకు ఏడుపు వస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా కాంగ్రెస్ కార్యాలయం ముందు దాడి జరగడం నడిరోడ్డుపై అత్యాచారం జరగడం కంటే తక్కువేం కాదన్నారు.
తాజావార్తలు
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్తో కొత్త స్మార్ట్ టీవీ
-
Trent Boult విధ్వంసం.. యార్కర్తో బెయిర్స్టోకు షాక్.! ‘బై-బై’ సెలబ్రేషన్ వీడియో వైరల్.!
-
Telangana High Court: “సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా”.. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!