Gas leak in South Africa: సౌతాఫిక్రాలో దారుణం.. గ్యాస్ లీకై 16 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాఫ్రికాలోని ఓ మురికివాడలో గ్యాస్ లీక్ కావడంతో పిల్లలతో సహా 16 మంది చనిపోయారు. కొంతమంది వ్యక్తులు ఆస్పత్రుల్లో అత్యవసర చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి జరిగిన విపత్తు, అక్రమ మైనింగ్ కార్యకలాపాల వల్లే ఈ ప్రమాదం జరిగిందని సౌతాఫిక్రా అధికారులు వెల్లడించారు. జోహన్నెస్బర్గ్కు తూర్పున ఉన్న బోక్స్బర్గ్ జిల్లా సమీపంలోని ఏంజెలో అనధికారిక సెటిల్మెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
Also Read: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
Also Read
- Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
- Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
- Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. "ఎక్స్" అకౌంట్ నిలిపివేత..
- YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
సంఘటనా స్థలంలో 16 మంది చనిపోయారని అధికారులు నిర్ధారించారు. పారామెడిక్స్ జోక్యంతో మరికొందరిని గుర్తించాం.. అపస్మారక స్థితిలో ఉన్న వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారని అత్యవసర సేవల అధికారులు వెల్లడించారు. ఆస్పత్రిలో ఉన్నవారిలో, నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో పాటు మరో 11 మంది పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నా.. ప్రస్తుతం స్టేబుల్ గా ఉందని వాళ్లు పేర్కొన్నారు. ఇందులో ఓ మైనర్ పూర్తిగా కోలుకుంటున్నాడని తెలిపారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు.
Also Read: Nithiin: రాజకీయాల్లోకి హీరో నితిన్ ఎంట్రీ.. అక్కడి నుంచే పోటీ.. ?
ఎమర్జెన్సీ సర్వీసెస్కి గ్యాస్ పేలుడు జరిగిందని కాల్ వచ్చింది.. అక్కడికి వెళ్లి చూసేసరికి విషపూరిత వాయువు ఉన్న సిలిండర్ నుంచి గ్యాస్ లీకేజీ అయినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం గ్యాస్ను అక్రమ మైనింగ్ కార్యకలాపాల్లో భాగంగా ఉపయోగిస్తున్నట్లు వాళ్లు తెలిపారు. దక్షిణాఫ్రికా వాణిజ్య కేంద్రమైన జోహన్నెస్బర్గ్, దాని పరిసర ప్రాంతాలు 1880లో గోల్డ్ రష్ ఏర్పడింది. అప్పటినుంచి ఇక్కడ గనుల్లో బంగారం వెలికితీయడం స్టా్ర్ట్ చేశారు. అప్పటి నుంచి చాలా కాలంగా మైనింగ్ కంపెనీలు ఇక్కడ బంగారం వెలికి తీస్తున్నాయి. అయితే గతంలో కూడా బోక్స్బర్గ్ లో క్రిస్మస్ పండుగ సందర్భంగా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ని తీసుకువెళుతున్న ట్రక్కు వంతెన కింద ఇరుక్కుపోయి, లీకై పేలడంతో 41 మంది మరణించారు.
తాజావార్తలు
-
Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!