Gas leak in South Africa: సౌతాఫిక్రాలో దారుణం.. గ్యాస్ లీకై 16 మంది మృతి..
దక్షిణాఫ్రికాలోని ఓ మురికివాడలో గ్యాస్ లీక్ కావడంతో పిల్లలతో సహా 16 మంది చనిపోయారు. కొంతమంది వ్యక్తులు ఆస్పత్రుల్లో అత్యవసర చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి జరిగిన విపత్తు, అక్రమ మైనింగ్ కార్యకలాపాల వల్లే ఈ ప్రమాదం జరిగిందని సౌతాఫిక్రా అధికారులు వెల్లడించారు. జోహన్నెస్బర్గ్కు తూర్పున ఉన్న బోక్స్బర్గ్ జిల్లా సమీపంలోని ఏంజెలో అనధికారిక సెటిల్మెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
Also Read: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
Also Read
- CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- Beetroot Rice Recipe: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి! హెల్తీ బీట్రూట్ పులావ్ తయారు చేయండిలా..
- CM Chandrababu: ఏపీ ప్రజలకు NDA వల్ల మరోసారి స్వాతంత్య్రం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
సంఘటనా స్థలంలో 16 మంది చనిపోయారని అధికారులు నిర్ధారించారు. పారామెడిక్స్ జోక్యంతో మరికొందరిని గుర్తించాం.. అపస్మారక స్థితిలో ఉన్న వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారని అత్యవసర సేవల అధికారులు వెల్లడించారు. ఆస్పత్రిలో ఉన్నవారిలో, నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో పాటు మరో 11 మంది పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నా.. ప్రస్తుతం స్టేబుల్ గా ఉందని వాళ్లు పేర్కొన్నారు. ఇందులో ఓ మైనర్ పూర్తిగా కోలుకుంటున్నాడని తెలిపారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు.
Also Read: Nithiin: రాజకీయాల్లోకి హీరో నితిన్ ఎంట్రీ.. అక్కడి నుంచే పోటీ.. ?
ఎమర్జెన్సీ సర్వీసెస్కి గ్యాస్ పేలుడు జరిగిందని కాల్ వచ్చింది.. అక్కడికి వెళ్లి చూసేసరికి విషపూరిత వాయువు ఉన్న సిలిండర్ నుంచి గ్యాస్ లీకేజీ అయినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం గ్యాస్ను అక్రమ మైనింగ్ కార్యకలాపాల్లో భాగంగా ఉపయోగిస్తున్నట్లు వాళ్లు తెలిపారు. దక్షిణాఫ్రికా వాణిజ్య కేంద్రమైన జోహన్నెస్బర్గ్, దాని పరిసర ప్రాంతాలు 1880లో గోల్డ్ రష్ ఏర్పడింది. అప్పటినుంచి ఇక్కడ గనుల్లో బంగారం వెలికితీయడం స్టా్ర్ట్ చేశారు. అప్పటి నుంచి చాలా కాలంగా మైనింగ్ కంపెనీలు ఇక్కడ బంగారం వెలికి తీస్తున్నాయి. అయితే గతంలో కూడా బోక్స్బర్గ్ లో క్రిస్మస్ పండుగ సందర్భంగా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ని తీసుకువెళుతున్న ట్రక్కు వంతెన కింద ఇరుక్కుపోయి, లీకై పేలడంతో 41 మంది మరణించారు.
తాజావార్తలు
-
Nara Rohit: తండ్రి కాబోతున్న నారా హీరో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోషూట్
-
CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
-
IPL Rules: బౌలర్లకు న్యాయం కావాలి.. ఐపీఎల్ నిబంధనల్లో మార్పులు తప్పనిసరి!
-
Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
-
Beetroot Rice Recipe: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి! హెల్తీ బీట్రూట్ పులావ్ తయారు చేయండిలా..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!