Eluru Crime: మహిళలపై అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కీచకులు చిన్నా, పెద్దా తేడాలేకుండా తమ పశువాంఛ తీర్చుకుంటున్నారు. ప్రతిరోజు ఏదో ఒక మూల.. ఎక్కడో ఒకచోట బాలికలు, మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతూనే ఉన్నారు. చిన్నారులు, యువతులు, మహిళలు ఒంటరిగా కనపడితే చాలు.. మగాళ్లు మృగాళ్లుగా మారి వారి జీవితాలను అంధకారం చేస్తూ.. పైశాచిక ఆనందం పొందుతున్నారు. తాజాగా ఏలూరు జిల్లా నూజివీడు మండలంలో దారుణం చోటుచేసుకుంది. నూజివీడు మండలంలోని పల్లెర్లమూడిలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు.
Read Also: Suicide: ఆ వ్యాధితో బాధ పడుతూ.. భరించలేక గన్తో కాల్చుకుని యువకుడు ఆత్మహత్య
ఆదివారం రాత్రి 11 గంటలకు తల్లిదండ్రుల వద్ద నిద్రపోతున్న బాలికను ఎత్తుకెళ్లి.. పక్కనే ఉన్న పామాయిల్ తోటలో అత్యాచారానికి పాల్పడి ఆమెను అక్కడే వదిలి వెళ్లాడు. బాలికపై అత్యాచార ఘటనపై మంత్రి పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. బాలికను ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలోని బాలికకు అవసరమైన వైద్యం అందించాలని మంత్రి సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితుడి కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటున్న ఈ ఘటనలు చూస్తుంటే అది ఎవ్వరి నిర్లక్ష్యమో అర్థం కావడం లేదు. ముక్కు పచ్చలారని చిన్నారులపై ఈ దుర్మార్గులు దుర్బుద్దితో వ్యవహరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి అవమానీయ ఘటనలు చోటు చేసుకోవడం శోచనీయం.