Atiq Ahmad : అతీక్ అహ్మద్ ఆర్థిక మూలాలను దెబ్బకొడుతున్న యూపీ సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హత్యకు గురైన గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్.. అతని సోదరుడు అతీక్ అష్రఫ్ అహ్మద్.. తమను చంపేస్తారని ప్రాణభయంతో చేసిన వ్యాఖ్యలే నిజమయ్యాయి. శనివారం రాత్రి.. వీరిద్దరిని దుండగులు అతి దారుణంగా కాల్పి చంపారు. అతీక్ అహ్మద్ కుమారుడు ఈ నెల 13న పోలీసుల ఎన్ కౌంటర్ లో చనిపోగా.. తాజాగా అతడ్ని, సోదరుడిని దుండగులు కాల్చిచంపారు. అతీక్ అహ్మద్ అయిదుగురు కుమారుల్లో అసద్ మృతి చెందగా.. మిగతా నలుగురిలో ఇద్దరు కుమారులు జైల్లో ఉన్నారు. మైనర్లయిన ఇద్దరు కుమారులు గృహ నిర్భందంలో ఉన్నారు. అతీక్, అష్రఫ్ భార్యలు పరారీలో ఉన్నారు.
Also Read : YS Bhaskar Reddy: వివేకా హత్య కేసులో కీలక మలుపు.. పులివెందులలో వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
2005లో బీఎస్పీ శాసనసభ్యుడు రాజు పాల్ హత్య కేసులో అతీక్ అహ్మద్ ప్రధాన నిందితుడు.. 2019 నుంచి సబర్మతి జైల్లో ఉన్నాడు. అతీక్ పై వందకు పైగా క్రిమినల్ కేసులున్నాయి. రాజు పాల్ హత్య కేసులో ముఖ్యసాక్షిగా ఉన్న ఉమేశ్ పాల్ 2006లో కిడ్నాప్ కు గురై విడుదల అయ్యాడు. 2007లో అతడు, అతీక్, అష్రఫ్తో పాటు మరికొందరిపై కిడ్నాప్ కేసు పెట్టాడు.
Also Read : Varuthini Ekadashi: వరూధిని ఏకాదశి రోజు ఈ స్తోత్రాలు వింటే ధన ప్రాప్తి సిద్ధిస్తుంది
కిడ్నాప్ కేసు విచారణ చివరి రోజైన ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉమేశ్ పాల్ హత్యకు గురయ్యాడు. ఈ కేసులోనూ అతీక్ కుటుంబ సభ్యులే ప్రధాన నిందితులు. ఉమేశ్ పాల్ హత్య కేసు విచారణ నేపథ్యంలో బూటకపు ఎన్ కౌంటర్ లో చంపేస్తారని అతీక్ అహ్మద్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అతనికి అక్కడ చుక్కెదురైంది. అప్పుడు గుజరాత్ సబర్మతి కేంద్ర కారాగారంలో ఉన్న అతీక్ ను ఓ కేసు అతీక్ ను చివరకు ఉత్తరప్రదేశ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
Also Read : Surya Stotra: సూర్య స్తోత్ర పారాయణం చేస్తే మోక్షం పొందుతారు
అయితే తనను రెండు వారాల్లో జైలు నుంచి బయటకు రప్పించి చంపేస్తామని ఓ సీనియర్ అధికారి బెదిరించినట్లు అష్రప్ ఇటీవల ఆరోపించారు. ఒకవేళ తాను హత్యకు గురైతే ఆ అధికారి పేరు ముఖ్యమంత్రికి చేరుతుందన్నారు. మరోవైపు అతీక్ నేరసామ్రాజ్యాన్ని కూల్చేస్తున్న యోగి సర్కార్.. అతీక్ అహ్మద్ ఆర్థిక మూలాలను పెకిలించి వేస్తున్నారు. అతీక్ అహ్మద్, అతని అనుచరుల అక్రమాస్తుల్లో ఇప్పటి వరకు 1400 కోట్ల రూపాయల విలువైన సంపదను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మరో 108 కోట్ల రూపాయల నల్ల ధనాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అధికారులు గుర్తించారు. అతీక్ అహ్మద్ కు సంబంధించిన వారి ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!