Atchannaidu : బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను జగన్ మోసం చేస్తున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పేదల గొంతు కొస్తున్న పెత్తందారు జగన్ రెడ్డి పేరుతో టీడీపీ బ్రౌచర్ విడుదల చేశారు టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను జగన్ మోసం చేస్తున్నాడన్నారు. పెత్తందారు జగన్ పేదల గొంతు కొస్తూ పాలన చేస్తున్నారని, అన్ని వర్గాలన జగన్ ఇబ్బంది పెట్టారన్నారు. బడుగుల అభివృద్ధిపై ఇన్నాళ్లూ గాఢ నిద్రలో ఉండి.. మళ్లీ మోసం చేసేందుకు బస్ యాత్ర అంటున్నారని, బడుగులను జగన్ ఊచ కోత కోశారన్నారు అచ్చెన్నాయుడు. బడుగుల హక్కులను జగన్ ప్రభుత్వం కాలరాశారని, దారి మళ్లించిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల గురించి సమాధానం చెప్పి వైసీపీ బస్ యాత్ర చేపట్టాలన్నారు అచ్చెన్నాయుడు.
Also Read : BS Yeddyurappa Security: మాజీ సీఎంకు Z+ సెక్యురిటీ.. భద్రతను పెంచాల్సిన అవసరం ఏమొచ్చిందంటే?
Also Read
- Akhilesh Yadav: రామమందిరంలో కానుకలు మాయం?.. అఖిలేష్ సంచలన ఆరోపణ
- Vijay Antony: బిగ్ షాక్.. సినిమా ఇండస్ట్రీకి విజయ్ ఆంటోని గుడ్ బై..
- Pant Video: ఏంటి పంత్ భయ్యా ఆ కొట్టుడు.. నువ్వు కొట్టిన దెబ్బకు డ్రోన్ పగిలి గ్రౌండ్లో పడిపోయిందిగా..?
- Kiren Rijiju: ‘దేశాన్ని విభజించొద్దు’.. రేవంత్ వ్యాఖ్యలకు రిజిజు ఘాటు సమాధానం
అంతేకాకుండా.. ‘నిధుల్లేని.. ఆర్థిక సాయం అందించలేని కార్పోషన్లను ఏర్పాటు చేసి బీసీ కులాలను మోసం చేశారు. పుట్టినప్పట్నుంచి.. చనిపోయేంత వరకు బడుగుల కోసం చంద్రబాబు ఎన్నో పథకాలు పెట్టారు. చంద్రబాబు పెట్టిన పథకాలని జగన్ రద్దు చేశారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లల్లో జగన్ ప్రభుత్వం బీసీ కోటాను తగ్గించేశారు. బీసీలకు అన్యాయం జరుగుతోంటే నోరు తెరిచి మాట్లాడలేని బీసీలకు మంత్రి పదవి ఇచ్చారు. ఈ మంత్రుల వల్ల బడుగు వర్గాలకు ఏం న్యాయం జరుగుతుంది..? రెడ్డి వర్గానికి చెందిన నలుగురిని జగన్ సామంత రాజులుగా చేసుకున్నారు. రాజ్యం రెడ్ల చేతుల్లో పెట్టారు. పవర్ లేని పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇస్తే లాభమేముంది..? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులు గుండె మీద చేయి వేసుకుని ఆలోచించాలి. ఇంకెన్నాళ్లు రెడ్డిగారికి పి చేయాలని బడుగు వర్గాలకు చెందిన మంత్రులు ఆలోచించుకోవాలి. మా ప్రశ్నలకు సమాధానం చెప్పాకే మంత్రులు బస్ యాత్ర ప్రారంభించాలి.’ అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.
Also Read : Pakistan : ఒక్క మ్యాచ్తో ఆస్ట్రేలియా రాతే మారిపోయింది.. ఇక పాకిస్తాన్కు సెమీస్ కష్టమే!
తాజావార్తలు
-
‘Peddi’: టాలీవుడ్ అంటే అంత అలుసా? ‘పెద్ది’ విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
-
Akhilesh Yadav: రామమందిరంలో కానుకలు మాయం?.. అఖిలేష్ సంచలన ఆరోపణ
-
Harish Rao : రేవంత్కు రైతుల శాపం తప్పదు.. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది
-
Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
-
Vijay Antony: బిగ్ షాక్.. సినిమా ఇండస్ట్రీకి విజయ్ ఆంటోని గుడ్ బై..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!