Minister Satyakumar Yadav: మహోన్నత వ్యక్తి వాజ్పేయ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Satyakumar Yadav: మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వాజ్పేయ్ ఒక సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి ఎదిగారని అన్నారు. పార్టీలు, ప్రాంతాలు, వర్గాలు, వైషమ్యాలకు అతీతంగా ఆయన అందరితో శభాష్ అనిపించుకున్నారని చెప్పారు. పది సార్లు లోక్ సభ సభ్యునిగా, రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా పని చేశారని, మూడు సార్లు ఈ దేశ ప్రధానిగా పని చేసి, దేశం రూపురేఖలు మార్చారని కొనియాడారు. ఒక్క అవినీతి మచ్చ కూడా లేని నిష్కలంక చరితుడు, హిమాలయాలు అంత మహోన్నత వ్యక్తి వాజ్పేయ్ అని అన్నారు.
READ ALSO: Sachin Tendulkar: క్రికెట్ దేవుడి సంపద ఎంత? సచిన్ టెండూల్కర్ ఆస్తుల విలువ తెలిస్తే షాక్ కావాల్సిందే!
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
ఆయన అనేక సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంటూ విలువతో కూడిన రాజకీయాలు చేశారని చెప్పారు. నమ్మిన సిద్దాంతం కోసం పని చేస్తూ, రెండు సీట్ల నుంచి బీజేపీని అప్రతిహతంగా అధికారంలో ఉండేలా పునాదులు వేసిన వ్యక్తి వాజ్పేయ్ అని అన్నారు. విజయనగరం ప్రజలు సాహితీ ప్రియులని, వాజ్ పేయ్ కూడా కళా హృదయం, కవితా హృదయం కలిగిన వారని చెప్పారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేలా, ప్రజల కన్నీళ్లు తుడిచేలా ఆయన పని చేశారని గుర్తు చేశారు. అపజయాన్ని ఏనాడు అంగీకరించకుండా, విజయాన్ని సాధించే వరకు పట్టువదలని విక్రమార్కుడిలా పని చేశారని పేర్కొన్నారు. నిజమైన నాయకుడు కాలంతో కరిగిపోయేవాడు కాదని, కలకాలం ప్రజల గుండెల్లో నిలిచేవారని చెప్పారు. ఆయన శత జయంతి సందర్భంగా నేడు సుపరిపాల యాత్ర ద్వారా అందరికీ ఆ గొప్పతనం చెప్పాలని నిర్ణయించినట్లు తెలిపారు. వాజ్పేయ్ చూపిన దారిలోనే ప్రధాని మోడీ నడుస్తూ, ఆ పథకాలు, అభివృద్దిని ముందుకు తీసుకు వెళుతున్నారని చెప్పారు. ఐదు దశాబ్దాల పాటు వెంకయ్యనాయుడు, వాజ్పేయ్తో కలిసి నడిచారని, అదే విలువలను వెంకయ్యనాయుడు కూడా పాటిస్తూ ప్రజలకు సేవలు అందించారని అన్నారు. అటల్ జీ, చంద్రబాబు నాయకత్వంలో వెంకయ్యనాయుడు సారథిగా పని చేశారని గుర్తు చేశారు.
READ ALSO: Hyderabad: నార్సింగి లో దారుణం.. కాళ్ల పట్టీల కోసం వివాహిత దారుణ హత్య..
తాజావార్తలు
-
Allu Arjun : అల్లుఅర్జున్ ‘రాకా’ 2027లో రావడం కూడా కష్టమేనా.?
-
US strikes on Iran: మళ్లీ యుద్ధం.. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు.. హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటన
-
ARYA : తమిళ హీరో ఆర్యపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు
-
Jr NTR: జూలై 18న ఎన్టీఆర్ కీలక ప్రకటన? అభిమాన సంఘాల ఏకీకరణ వెనుక అసలు ఉద్దేశమేంటి?
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!