Paris Olympics 2024: 58 ఏళ్ల వయసులో ఒలింపిక్స్లో అరంగేట్రం.. కల నెరవేర్చుకున్న బామ్మ!
- 58 ఏళ్ల వయస్సులో పారిస్ ఒలింపిక్స్లో అరంగేట్రం
- కల నెరవేర్చుకోవడానికి వయస్సుతో పని లేదని నిరూపించిన బామ్మ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paris Olympics 2024: చాలావరకు ఎవరైనా పెద్ద వయస్సు వచ్చాకా.. కలలు కనడం మానేస్తారు. వాటిని నెరవేర్చుకోవడం గురించి ఆలోచించడమే మానేస్తారు. ఎవరైనా వయస్సు అయిపోయిన వృద్ధులు పని చేస్తుంటే.. ఇంకా ఈ వయస్సులో ఎందుకు ఆ తంటాలు అని తరచుగా మనం వింటుంటాం. కానీ కలలను నెరవేర్చుకోవడానికి వయస్సు అడ్డంకి కాదని నిరూపించింది జియింగ్ జెంగ్. ఆమె ఎవరో కాదు చిలీ తరపున ఆడిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి జియింగ్ జెంగ్. ఆమె తన 58 ఏళ్ల వయస్సులో పారిస్ ఒలింపిక్స్లో అరంగేట్రం చేసింది. అతిపెద్ద వయస్సులో అరంగేట్రం చేసిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. గెలుపు ఓటమిని పక్కన పెడితే ఆ వయస్సులో ఇతర ఆటగాళ్లతో సమానంగా ఆడడం గ్రేట్ అనే చెప్పాలి. పరిస్థితులు ఏమైనా మీ కలలను సాధించకుండా ఆపలేపని ప్రపంచానికి రుజువు చేసింది. ఒలింపిక్స్లో పాల్గొన్న అతిపెద్ద వయస్సు ఉన్న మహిళగా రికార్డు నెలకొల్పింది.
Read Also: IND vs SL: భారత్ ముందు స్వల్ప లక్ష్యం.. శ్రీలంక స్కోరు..?
Also Read
- APGEF Protest: గుండు చేయించుకుని ఏపీజీఈఎఫ్ వినూత్న నిరసన.. 'చంద్రన్న బోడిగుండు' అంటూ ప్లకార్డులు!
- Shabad Murders: రాజ్కుమార్ బెయిల్ ఆర్డర్లో సంచలన విషయాలు.. పోక్సో కేసులో ముందస్తు బెయిల్.?
- 5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
- Vietnam Boat Tragedy: నేడు భారత్కు 15 మంది భారతీయుల మృతదేహాలు.!
ఒలింపిక్స్లో పాల్గొనాలన్న తన చిరకాల కోరికను జియింగ్ జెంగ్ ఆలస్యంగా సాకారం చేసుకుంది. చైనాలో జన్మించిన జియింగ్ జెంగ్ ప్రస్తుతం చిలీకి ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆమెకు అంత సులువుగా ఆ అవకాశం దక్కలేదు మరీ. దక్షిణ చైనాలోని ఫోషన్లో జన్మించిన జియింగ్ జెంగ్.. స్థానిక టేబుల్ టెన్నిస్ కుమార్తె. చిన్నతనంలో, ప్రొఫెషనల్ టేబుల్ టెన్నిస్ శిక్షణా సమావేశాలకు ఆమె తల్లితో పాటే వెళుతూ ఆ ఆట మీద ప్రేమను పెంచుకుంది. 18 ఏళ్ల వయసులో సొంత దేశమైన చైనా తరపున ఆడాలని తీవ్రంగా ప్రయత్నించింది. కానీ ఒలింపిక్స్ అరంగేట్రానికి ముందే ఆమె తనకెంతో ఇష్టమైన ఆటకు దూరమైంది.
రెండేళ్ల తర్వాత 20 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించింది. అనంతరం 20 ఏళ్ల పాటు ఫర్నిచర్ షాప్ నడిపింది. ఆ తర్వాత చిలీలో వివిధ టేబుల్ టెన్నిస్ జట్లకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. కొవిడ్ సమయంలో ఆమె తిరిగి టేబుల్ టెన్నిస్ ఆడడం ప్రారంభించింది. కరోనా కాలంలో, జియింగ్ జెంగ్ టేబుల్ టెన్నిస్ ఆడటానికి బానిస అయ్యారు. ఆమెకు మ్యాచ్ ఆడాలనిపించింది. ఆమెకు కుటుంబం కూడా సహకరించింది. ఆమె చిలీలోని ఇక్విక్లో ఫెడరేషన్ సహాయంతో ప్రాంతీయ టోర్నమెంట్లలో ఆడటం ప్రారంభించారు. స్నేహితులు, కుటుంబ సభ్యులను ఒప్పించిన తర్వాత, 57 ఏళ్ల వయస్సులో 2023 సౌత్ అమెరికన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్కు కూడా అర్హత సాధించారు. 2023 శాంటియాగోలో జరిగిన పాన్ అమెరికన్ గేమ్స్లో జియింగ్ జెంగ్ చిలీ యొక్క సంచలన తారగా అవతరించింది. పారిస్ 2024 ఒలింపిక్స్లో ఆడే అవకాశాన్ని సంపాదించింది. మొత్తానికి 2024లో పారిస్ ఒలింపిక్స్లో ఆడి తన కలను నెరవేర్చుకుంది.
తాజావార్తలు
-
Odisha Shocker: విషాద ఘటన.. భార్య మొబైల్తో తలపై కొట్టడంతో భర్త మృతి..
-
APGEF Protest: గుండు చేయించుకుని ఏపీజీఈఎఫ్ వినూత్న నిరసన.. ‘చంద్రన్న బోడిగుండు’ అంటూ ప్లకార్డులు!
-
Shabad Murders: రాజ్కుమార్ బెయిల్ ఆర్డర్లో సంచలన విషయాలు.. పోక్సో కేసులో ముందస్తు బెయిల్.?
-
Puri Jagannath Temple: ప్రతి 12 ఏళ్లకోసారి పూరీ జగన్నాథుడి విగ్రహాన్ని ఎందుకు మారుస్తారు? నవకళేబరంలో దాగిన రహస్యం ఇదే!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
ట్రెండింగ్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!