Site icon NTV Telugu

Crime News: చాక్లెట్ ఆశ చూపి బాలికపై లైంగిక దాడికి యత్నం

Crime News

Crime News

Crime News: దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారాయి. ఎన్ని చట్టాలు వచ్చినా కామాంధుల తీరు మారడం లేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా మారింది. కన్న బిడ్డలను కాపాడుకోవడం తల్లిదండ్రులకు కత్తిమీద సాములాగా మారింది. తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పెత్తుల్లా గ్రామంలో జరిగిన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది.

Read Also: Karnataka: అమ్మాయితో మాట్లాడినందుకు స్కూల్ విద్యార్థిపై పిడిగుద్దులు..

ఓ మైనర్‌ బాలికపై 55 సంవత్సరాల వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. చాక్లెట్ ఆశ చూపి లైంగికదాడికి పాల్పడబోయాడు నిందితుడు బోడ నర్సింహ(55). వెంటనే ఆ చిన్నారి కేకలు వేయడంతో నిందితుడు నర్సింహ అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ చిన్నారి ఈ విషయాన్ని తల్లికి చెప్పింది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక బంధువులు, స్థానికులు పోలీస్‌ స్టేషన్ ముందు ఆందోళన వ్యక్తం చేశారు.

Exit mobile version