Site icon NTV Telugu

Himanta Biswa Sarma: వచ్చే 3 ఏళ్లలో పంజాబ్ జీడీపీని అస్సాం అధిగమిస్తుంది..

Himanta Biswa Sarma

Himanta Biswa Sarma

Himanta Biswa Sarma: బాల్య వివాహాల ఆరోపణలపై అరెస్టయిన దాదాపు 1000 మందికి ఇంకా బెయిల్ రాలేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ బుధవారం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం బాల్య వివాహాలను రాష్ట్రం నుండి తొలగిస్తుందని సీఎం అసెంబ్లీలో వెల్లడించారు. బాల్య వివాహాల ఆరోపణలపై సుమారు 1000 మంది జైలులో ఉన్నారని, ఈ విషయంలో కోర్టు చాలా దృఢంగా ఉన్నందున వారికి ఇంకా బెయిల్ రాలేదని అన్నారు. బాల్య వివాహాలపై భారీ అణిచివేత ఫిబ్రవరి 3 నుండి ప్రారంభమైంది. అస్సాం అంతటా ఇప్పటివరకు 3,000 మందికి పైగా బాల్య వివాహాలతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.

Read Also: Eric Garcetti: భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్‌ గార్సెట్టి

14 ఏళ్లలోపు బాలికలను వివాహం చేసుకున్న పురుషులపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం కేసు నమోదు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది. రాష్ట్రం రుణం-జీడీపీ నిష్పత్తిని 23 శాతం వద్ద కొనసాగిస్తోందని, వచ్చే మూడేళ్లలో అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం పంజాబ్ జీడీపీని అధిగమిస్తుందని హిమంత బిస్వా శర్మ అన్నారు. పంజాబ్ జీడీపీ దాదాపు రూ.6,80,000 కోట్లుగా ఉంది. అస్సాం జీడీపీ రూ. 4,93,000 కోట్లకు చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం పరంగా చూస్తే నిరుద్యోగుల సంఖ్య 22 లక్షల నుంచి 12 లక్షలకు తగ్గిందని శర్మ అసెంబ్లీలో చెప్పారు. అస్సాంలో ఇప్పుడు పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చే వాతావరణం ఉంది. పూర్తి పారదర్శకత ఉంది. ఉద్యోగాలకు ఒక్క అభ్యర్థిని కూడా సిఫారసు చేయనందుకు కొంతమంది పార్టీ వ్యక్తుల నుంచి తాను కొన్నిసార్లు విమర్శలను భరించవలసి ఉంటుందని అస్సాం ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Exit mobile version