Hit and Run Law: హిట్ అండ్ రన్ యాక్ట్ ను వ్యతిరేకిస్తూ 48 గంటల సమ్మెకు పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిట్ అండ్ రన్ కేసులపై కొత్త శిక్షాస్మృతిని వ్యతిరేకిస్తూ ఇవాళ్టి నుంచి 48 గంటల సమ్మెకు అస్సాం ట్రాన్స్పోర్టర్ యూనియన్లు పిలుపునిచ్చింది. దీని కారణంగా అస్సాంలో అన్ని వాణిజ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది. సమ్మెకు సంబంధించి, బస్సులు, క్యాబ్లతో పాటు ఆటోలు, గూడ్స్ క్యారియర్లు, ఇంధన ట్యాంకర్లతో సహా అనేక ప్రజా రవాణా సంఘాలు చేతులు కలిపి ఉద్యమంలో పాల్గొంటున్నట్లు ప్రకటించాయి.
Read Also: Jasprit Bumrah: నా హృదయంలో ఈ మైదానానికి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది!
Also Read
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
- KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
కాగా, అస్సాం మోటార్ వర్కర్స్ అసోసియేషన్ ఉమ్మడి వేదిక కన్వీనర్ రామన్ దాస్ మాట్లాడుతూ.. ఎలాంటి దురదృష్టకర సంఘటనలు జరిగినా డ్రైవర్లను మాత్రమే నిందించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పేద డ్రైవర్లు శిక్షించబడుతున్నారు.. ఏ డ్రైవరూ ఉద్దేశపూర్వకంగా ప్రమాదానికి కారణం కాదని, చాలాసార్లు ప్రమాదానికి గురైన ఇతరుల తప్పిదమేనని ఆయన అన్నారు. హిట్ అండ్ రన్ కేసులపై కొత్త చట్టం డ్రైవర్ వ్యతిరేక, వాహనాల యజమానులకు వ్యతిరేకంగా ఉందని అతడు పేర్కొన్నారు. వెంటనే ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలనే డిమాండ్ చేస్తూ.. ఇవాళ ఉదయం 5 గంటల నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకు అన్ని వాహనాల సమ్మెలో పాల్గొంటాయని చెప్పుకొచ్చారు.
Read Also: Gun Firing: అమెరికాలో కాల్పుల కలకలం.. తుఫాకీతో కాల్చి చంపిన టీనేజర్..
భారతీయ శిక్షాస్మృతి (IPC) స్థానంలో వచ్చిన ఇండియన్ పీనల్ కోడ్ (BNS) ప్రకారం, ర్యాష్ డ్రైవింగ్ ద్వారా తీవ్రమైన రోడ్డు ప్రమాదానికి కారణమైన డ్రైవర్లు, అధికారులకు సమాచారం ఇవ్వకుండా పారిపోతే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా 7 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది.. దీంతో పాటు లక్ష రూపాయల జరిమానా కూడా విధించవచ్చు అని ఆ చట్టంలో ఉంది. బ్రిటీష్ కాలం నాటి ఐపీసీలో ఇలాంటి నేరాలకు రెండేళ్ల శిక్ష ఉండేది. కమర్షియల్ వాహనమైనా, చిన్న కారు అయినా ప్రతి ఒక్కరికీ చట్టం వర్తిస్తుంది.. కాబట్టి సమ్మెలో ప్రైవేట్ కార్ల యజమానులు కూడా పాల్గొనవల్సిందిగా ట్రాన్స్పోర్టర్స్ ఫోరం కోరింది.
తాజావార్తలు
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
-
ViewSonic Google TV Series: భారత్లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!