Assam : అస్సాం గ్యాంగ్ రేప్ కేసు నిందితుడు.. చెరువులో దూకి ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam : అస్సాంలోని నాగోన్ డింగ్ గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు తఫాజుల్ ఇస్లాం మరణించాడు. నేరస్థలానికి తీసుకెళ్తుండగా పోలీసుల అదుపు నుంచి తప్పించుకుని చెరువులో దూకినట్లు చెబుతున్నారు. నిందితుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు అతన్ని నేరస్థలానికి తీసుకెళ్తుండగా చెరువులో దూకినప్పుడు మరణించాడని పోలీసులు తెలిపారు.
రెండు గంటలపాటు వెతికిన తర్వాత నిందితుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు నేరస్థులు అమాయకపు చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ట్యూషన్ నుండి తిరిగి వస్తుండగా, 10వ తరగతి విద్యార్థినిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి, రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో ఉంచారు. బాధితురాలు వివస్త్రగా పడి ఉండటాన్ని ఎవరో గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
Read Also:Blast in Firework Factory: ఏపీలో మరో ప్రమాదం.. టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు.. ఇద్దరు మృతి
ఈ ఘటన తర్వాత అస్సాంలో పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. బాధితురాలిని నాగావ్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో చేర్చారు పరిస్థితి విషమంగా ఉంది. మైనర్పై సామూహిక అత్యాచారం ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై స్థానికులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. దీంతో పాటు నిందితులను అరెస్టు చేసే వరకు నిరవధిక బంద్కు వివిధ సంస్థలు, నిర్వాసితులు డిమాండ్ చేశారు.
ఈ ఘటనను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఖండించారు. మైనర్పై జరిగిన దారుణ ఘటన మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరమని ట్వీట్ చేశారు. ఇది మా సామూహిక మనస్సాక్షిని గాయపరిచింది. నిందితులను విడిచి పెట్టబోమన్నారు. సంఘటనా స్థలాన్ని సందర్శించి అటువంటి రాక్షసులపై సత్వర న్యాయం జరిగేలా చూడాలని అస్సాం పోలీసు డిజిపిని ఆదేశించానన్నారు. బాధితురాలు ప్రస్తుతం బాగానే ఉందని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, రాష్ట్ర కేబినెట్ మంత్రి పీయూష్ హజారికా తెలిపారు. ఘటన అనంతరం మంత్రి పీయూష్ హజారికా ఢింగ్ను సందర్శించి బాధితురాలి ఆరోగ్యాన్ని అడిగి తెలుసుకున్నారు.
Read Also:Nag Aswin: ప్రభాస్పై బాలీవుడ్ నటుడి విమర్శలకు నాగ్ అశ్విన్ రిప్లై అదుర్స్ కదూ..
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..