BJP: రూ.5 లక్షల కోట్ల పెట్టుబడి, భారీగా ఉపాధి అవకాశాలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Assam Manifesto 2026: అస్సాం అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (BJP) ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. గౌహతిలోని అస్సాం బీజేపీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో విడుదల చేసిన మేనిఫెస్టోకు పార్టీ ‘సంకల్ప పత్రం’ అని పేరు పెట్టింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, అస్సాం బీజేపీ అధ్యక్షుడు దిలీప్ సైకియా, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ మ్యానిఫెస్టోలో ప్రజలకు వరాల జల్లులు కురిపించారు. రాష్ట్రంలో తాము తిరిగి అధికారంలోకి వస్తే ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెడతామని, భూ జిహాద్కు ముగింపు పలుకుతామని హామీ ఇచ్చారు. అస్సాంలో యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ)ని అమలు చేస్తామని, రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
READ MORE: Operation Kagar: నేటితో ముగుస్తున్న ‘కగార్’ డెడ్లైన్.. మావో శకం ముగిసినట్లేనా?
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు:
మౌలిక సదుపాయాలు: రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడి.
భూమి సంరక్షణ: బంగ్లాదేశీ మియాల (వలసదారులు) ఆక్రమణలో ఉన్న భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం.
చట్టాలు: రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code – UCC) అమలు చేయడం.
ఉపాధి: యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించడం మరియు స్వదేశీ ప్రజల గౌరవ మర్యాదలను కాపాడటం.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రసంగించారు. ఆరవ షెడ్యూల్లో చేర్చబడిన ప్రాంతాలు, అలాగే షెడ్యూల్డ్ తెగలు నివసించే ప్రాంతాలు దీని నుంచి మినహాయిస్తామని స్పష్టం చేశారు. లవ్ జిహాద్పై కఠిన చర్యలు తీసుకుంటామని, అస్సాంను వరద రహిత రాష్ట్రంగా మార్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి రెండేళ్లలో అస్సాంను వరద రహిత రాష్ట్రంగా మార్చేందుకు 18,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాకు ఒక వైద్య కళాశాల, ఒక విశ్వవిద్యాలయం, ఒక ఇంజనీరింగ్ కళాశాల తీసుకురావడమే తన లక్ష్యమన్నారు. రాబోయే ఐదేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలు సృష్టిస్తానని చెప్పారు. మరోవైపు.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. “గత 60 ఏళ్లలో కాంగ్రెస్ సాధించలేని మార్పును బీజేపీ కేవలం పదేళ్లలోనే సాధించి చూపించింది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై కాంగ్రెస్కు ఎప్పుడూ సరైన విజన్ లేదు” అని ఆమె ఆరోపించారు. ఒకప్పుడు అస్సాం యువత అవకాశాల కోసం వెతుక్కుంటూ బయటకు వెళ్లేవారని, ఇప్పుడు బీజేపీ పాలనలో పెరిగిన అవకాశాల వల్ల విదేశీ కెరీర్లను వదులుకుని మరీ సొంత రాష్ట్రానికి తిరిగి వస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!