Asia Cup 2025: కరచాలనం సరే.. ఛాంపియన్ అయ్యాక భారత్ ట్రోఫీ తీసుకుంటుందా?
- ఆసియా కప్ 2025లో కరచాలనం వివాదం
- రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను తొలగించాలని పీసీబీ డిమాండ్
- పీసీబీ అధ్యక్షుడి చేతుల మీదుగా టోర్నీ ఎలా తీసుకుంటుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ 2025లో ‘కరచాలనం’ వివాదం నడుస్తోంది. ఆదివారం (సెప్టెంబర్ 14) మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్స్ కరచాలనం చేయడానికి తిరస్కరించడమే ఈ వివాదానికి కారణం. పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలపడం కోసమే ఇలా చేశామని భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. ఈ ఘటనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఫైర్ అయింది. ఇందుకు బాధ్యుణ్ని చేస్తూ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను తొలగించాలని పీసీబీ డిమాండ్ చేసింది. ఒకవేళ రిఫరీని తొలగించకుంటే.. టోర్నీనే బహిష్కరిస్తామని హెచ్చరించింది.
కరచాలనం ఘటనపై ఆసియా క్రికెట్ సంఘం (ఏసీసీ)కు పీసీబీ ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో ఏం చేయాలో తెలియని ఏసీసీ.. ఐసీసీ జోక్యాన్ని కోరుతోంది. పీసీబీ బాస్ మొహ్సిన్ నఖ్వి (పాకిస్థాన్)నే ఏసీసీ అధ్యక్షుడు కావడం, ఐసీసీకి అధ్యక్షుడు జై షా (భారత్) కావడం ఇక్కడ విశేషం. ఇది ఐసీసీ ఈవెంట్ కాదు కాబట్టి జై షా చేతిలో ఏమీ ఉండదు. ఇక్కడ మొహ్సిన్ నఖ్విదే ఆధిపత్యం కొనసాగే అవకాశం ఉంది. ఏదేమైనా టోర్నీలో ఇక పైనా కూడా పాకిస్థాన్ క్రికెటర్లతో కరచాలనం చేయొద్దని భారత్ నిర్ణయించింది. దాంతో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
Also Read: Team India: ఒమన్పై యూఏఈ విజయం.. సూపర్-4లో భారత్!
ఆసియా కప్ 2025లో ఆడిన రెండు మ్యాచ్లలో గెలిచిన భారత్ గ్రూప్-ఎ నుంచి సూపర్-4లో చోటు దక్కించుకుంది. ఫైనల్ చేరడం కూడా టీమిండియాకు పెద్ద విషయం కాదు. గ్రూప్-ఎ నుంచి పాక్ కూడా సూపర్-4కు అర్హత సాధించే అవకాశాలు ఉన్నాయి. గ్రూప్-బి నుంచి శ్రీలంక దాదాపుగా చోటు ఖాయం చేసుకుంది. ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లలో ఓ జట్టు సూపర్-4కు చేరనుంది. భారత్ ఫామ్ చూస్తే.. ఫైనల్ ఛాంపియన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ భారత్ ఛాంపియన్ అయితే.. పీసీబీ బాస్ మొహ్సిన్ నఖ్వి చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవాల్సి ఉంటుంది. మరి కరచాలనం చేయకూడని నిర్ణయం తీసుకున్న భారత్.. పీసీబీ అధ్యక్షుడి చేతుల మీదుగా టోర్నీ ఎలా తీసుకుంటుంది. ఇప్పుడు ఇదే అందరి మెదడుని తెలుస్తున్న పెద్ద ప్రశ్న. చూడాలి మరి ఏం జరుగుతుందో.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!