Asia Cup 2025: కరచాలనం సరే.. ఛాంపియన్ అయ్యాక భారత్ ట్రోఫీ తీసుకుంటుందా?
- ఆసియా కప్ 2025లో కరచాలనం వివాదం
- రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను తొలగించాలని పీసీబీ డిమాండ్
- పీసీబీ అధ్యక్షుడి చేతుల మీదుగా టోర్నీ ఎలా తీసుకుంటుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ 2025లో ‘కరచాలనం’ వివాదం నడుస్తోంది. ఆదివారం (సెప్టెంబర్ 14) మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్స్ కరచాలనం చేయడానికి తిరస్కరించడమే ఈ వివాదానికి కారణం. పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలపడం కోసమే ఇలా చేశామని భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. ఈ ఘటనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఫైర్ అయింది. ఇందుకు బాధ్యుణ్ని చేస్తూ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను తొలగించాలని పీసీబీ డిమాండ్ చేసింది. ఒకవేళ రిఫరీని తొలగించకుంటే.. టోర్నీనే బహిష్కరిస్తామని హెచ్చరించింది.
కరచాలనం ఘటనపై ఆసియా క్రికెట్ సంఘం (ఏసీసీ)కు పీసీబీ ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో ఏం చేయాలో తెలియని ఏసీసీ.. ఐసీసీ జోక్యాన్ని కోరుతోంది. పీసీబీ బాస్ మొహ్సిన్ నఖ్వి (పాకిస్థాన్)నే ఏసీసీ అధ్యక్షుడు కావడం, ఐసీసీకి అధ్యక్షుడు జై షా (భారత్) కావడం ఇక్కడ విశేషం. ఇది ఐసీసీ ఈవెంట్ కాదు కాబట్టి జై షా చేతిలో ఏమీ ఉండదు. ఇక్కడ మొహ్సిన్ నఖ్విదే ఆధిపత్యం కొనసాగే అవకాశం ఉంది. ఏదేమైనా టోర్నీలో ఇక పైనా కూడా పాకిస్థాన్ క్రికెటర్లతో కరచాలనం చేయొద్దని భారత్ నిర్ణయించింది. దాంతో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read
- Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
- Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
- Kerala: వ్యాయామానికి మతం రంగు.. కేరళలో వివాదంగా ‘‘ఇస్లామిక్-ఫ్రెండ్లీ జిమ్’’..
- Team India Injuries: టీమిండియాకు వరుస షాక్లు.. కోహ్లీ ఔట్.. రోహిత్కు గాయం..! హార్దిక్ కూడా అనుమానమేనా..?
Also Read: Team India: ఒమన్పై యూఏఈ విజయం.. సూపర్-4లో భారత్!
ఆసియా కప్ 2025లో ఆడిన రెండు మ్యాచ్లలో గెలిచిన భారత్ గ్రూప్-ఎ నుంచి సూపర్-4లో చోటు దక్కించుకుంది. ఫైనల్ చేరడం కూడా టీమిండియాకు పెద్ద విషయం కాదు. గ్రూప్-ఎ నుంచి పాక్ కూడా సూపర్-4కు అర్హత సాధించే అవకాశాలు ఉన్నాయి. గ్రూప్-బి నుంచి శ్రీలంక దాదాపుగా చోటు ఖాయం చేసుకుంది. ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లలో ఓ జట్టు సూపర్-4కు చేరనుంది. భారత్ ఫామ్ చూస్తే.. ఫైనల్ ఛాంపియన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ భారత్ ఛాంపియన్ అయితే.. పీసీబీ బాస్ మొహ్సిన్ నఖ్వి చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవాల్సి ఉంటుంది. మరి కరచాలనం చేయకూడని నిర్ణయం తీసుకున్న భారత్.. పీసీబీ అధ్యక్షుడి చేతుల మీదుగా టోర్నీ ఎలా తీసుకుంటుంది. ఇప్పుడు ఇదే అందరి మెదడుని తెలుస్తున్న పెద్ద ప్రశ్న. చూడాలి మరి ఏం జరుగుతుందో.
తాజావార్తలు
-
Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
-
Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
-
Kerala: వ్యాయామానికి మతం రంగు.. కేరళలో వివాదంగా ‘‘ఇస్లామిక్-ఫ్రెండ్లీ జిమ్’’..
-
Team India Injuries: టీమిండియాకు వరుస షాక్లు.. కోహ్లీ ఔట్.. రోహిత్కు గాయం..! హార్దిక్ కూడా అనుమానమేనా..?
-
E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!