Asia Cup 2025: కరచాలనం సరే.. ఛాంపియన్ అయ్యాక భారత్ ట్రోఫీ తీసుకుంటుందా?
- ఆసియా కప్ 2025లో కరచాలనం వివాదం
- రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను తొలగించాలని పీసీబీ డిమాండ్
- పీసీబీ అధ్యక్షుడి చేతుల మీదుగా టోర్నీ ఎలా తీసుకుంటుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ 2025లో ‘కరచాలనం’ వివాదం నడుస్తోంది. ఆదివారం (సెప్టెంబర్ 14) మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్స్ కరచాలనం చేయడానికి తిరస్కరించడమే ఈ వివాదానికి కారణం. పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలపడం కోసమే ఇలా చేశామని భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. ఈ ఘటనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఫైర్ అయింది. ఇందుకు బాధ్యుణ్ని చేస్తూ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను తొలగించాలని పీసీబీ డిమాండ్ చేసింది. ఒకవేళ రిఫరీని తొలగించకుంటే.. టోర్నీనే బహిష్కరిస్తామని హెచ్చరించింది.
కరచాలనం ఘటనపై ఆసియా క్రికెట్ సంఘం (ఏసీసీ)కు పీసీబీ ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో ఏం చేయాలో తెలియని ఏసీసీ.. ఐసీసీ జోక్యాన్ని కోరుతోంది. పీసీబీ బాస్ మొహ్సిన్ నఖ్వి (పాకిస్థాన్)నే ఏసీసీ అధ్యక్షుడు కావడం, ఐసీసీకి అధ్యక్షుడు జై షా (భారత్) కావడం ఇక్కడ విశేషం. ఇది ఐసీసీ ఈవెంట్ కాదు కాబట్టి జై షా చేతిలో ఏమీ ఉండదు. ఇక్కడ మొహ్సిన్ నఖ్విదే ఆధిపత్యం కొనసాగే అవకాశం ఉంది. ఏదేమైనా టోర్నీలో ఇక పైనా కూడా పాకిస్థాన్ క్రికెటర్లతో కరచాలనం చేయొద్దని భారత్ నిర్ణయించింది. దాంతో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read
- Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
- Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
- 50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
Also Read: Team India: ఒమన్పై యూఏఈ విజయం.. సూపర్-4లో భారత్!
ఆసియా కప్ 2025లో ఆడిన రెండు మ్యాచ్లలో గెలిచిన భారత్ గ్రూప్-ఎ నుంచి సూపర్-4లో చోటు దక్కించుకుంది. ఫైనల్ చేరడం కూడా టీమిండియాకు పెద్ద విషయం కాదు. గ్రూప్-ఎ నుంచి పాక్ కూడా సూపర్-4కు అర్హత సాధించే అవకాశాలు ఉన్నాయి. గ్రూప్-బి నుంచి శ్రీలంక దాదాపుగా చోటు ఖాయం చేసుకుంది. ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లలో ఓ జట్టు సూపర్-4కు చేరనుంది. భారత్ ఫామ్ చూస్తే.. ఫైనల్ ఛాంపియన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ భారత్ ఛాంపియన్ అయితే.. పీసీబీ బాస్ మొహ్సిన్ నఖ్వి చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవాల్సి ఉంటుంది. మరి కరచాలనం చేయకూడని నిర్ణయం తీసుకున్న భారత్.. పీసీబీ అధ్యక్షుడి చేతుల మీదుగా టోర్నీ ఎలా తీసుకుంటుంది. ఇప్పుడు ఇదే అందరి మెదడుని తెలుస్తున్న పెద్ద ప్రశ్న. చూడాలి మరి ఏం జరుగుతుందో.
తాజావార్తలు
-
Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
-
Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!