Asia Cup 2025: మ్యాచ్ అనంతరం హైడ్రామా.. ట్రోఫీని తీసుకోని భారత్! సంబరాలు మాత్రం హైలెట్
- ఆసియా కప్ 2025 విజేతగా భారత్
- ఫైనల్ మ్యాచ్ అనంతరం హైడ్రామా
- భారత్ సంబరాలు మాత్రం హైలెట్
ఆసియా కప్ 2025 విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్స్ తేడాతో గెలిచింది. పాక్ నిర్ధేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో రెండు బంతులు ఉండగానే ఛేదించి.. తొమ్మిదోసారి ఆసియా కప్ను సొంతం చేసుకుంది. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ (69 నాటౌట్; 53 బంతుల్లో 3×4, 4×6) అద్భుత ఇన్నింగ్స్తో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. అయితే మ్యాచ్ అనంతరం హైడ్రామా చోటుచేసుకుంది.
ఆసియా కప్ 2025 ట్రోఫీని తీసుకునేందుకు టీమిండియా ప్లేయర్స్ నిరాకరించారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోలేమని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. ఈ క్రమంలోనే భారత్ ఫైనల్ వేడుకను బహిష్కరించింది. ప్లేయర్స్ అందరూ మైదానంలో పడుకుని తమ ఫోన్స్ చూసుకున్నారు. భారత్ ప్లేయర్స్ కోసం స్టేజ్పై ఏసీసీ చీఫ్ సహా యూఏఈ పెద్దలు పడిగాపులు కాశారు. అయినా కూడా మనోళ్లు తగ్గలేదు. దాంతో అక్కడ హైడ్రామా చోటు చేసుకుంది.
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
భారత్ ప్లేయర్స్ బెట్టు చేయడంట్ ఫైనల్ వేడుక కార్యక్రమం గంటన్నర లేటుగా ప్రారంభమైంది. ఎట్టకేలకు పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ కార్యక్రమం ప్రారంభం అయింది. చివరకు పాకిస్థాన్ ఆటగాళ్లు తమ రన్నరప్ ట్రోఫీని ఆందున్నారు. ఆపై ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డ్ను తిలక్ వర్మ, ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ అవార్డ్ను అభిషేక్ శర్మలు అందుకున్నారు. ఈ వార్డులను దుబాయ్ పెద్దలు అందించారు. అవార్డ్స్ అందుకున్న అనంతరం మనోళ్లు హోస్ట్ సైమన్ డౌల్తో మాట్లాడారు. ఆపై పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా తమ ఓటమిపై స్పందించాడు. ఇక ఫైనల్ వేడుక ముగిసిందని హోస్ట్ చెప్పాడు.
Also Read: Today Horoscope: ఆ రాశి వారికి నేడు అన్నీ అనుకూలమే.. పట్టిందల్లా బంగారమే!
ఫైనల్ వేడుక ముగిసిన అనంతరం భారత్ ఆటగాళ్లు ట్రోఫీ లేకుండానే సెలెబ్రేట్ చేసుకున్నారు. వేదికపై ఉండి ట్రోఫీ చేతిల్లో ఉన్నట్లు సంబరాలు జరుపుకున్నారు. టీమిండియా ప్లేయర్స్ ట్రోఫీ లేకుండా ఫొటోలకు ఫోజులిచ్చారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అయితే చేతిలో కప్ ఉన్నట్లు నడుచుకుంటూ స్టేజీపైకి ఎక్కాడు. ఈ సంబరాలు హైలెట్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలోనే పాకిస్థాన్కు చెందిన వ్యక్తి చేతుల మీదుగా టైటిల్ అందుకునేందుకు భారత్ నిరాకరించింది.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!