IND vs PAK: పాకిస్థాన్తో సూపర్-4 మ్యాచ్.. టీమిండియాకు హెచ్చరిక!
- దుబాయ్ వేదికగారాత్రి 8 గంటలకు ఇండో-పాక్ మ్యాచ్
- పాక్ బౌలింగ్ ఎప్పుడూ ప్రమాదకరమే
- దాయాది జట్టును అస్సలు తేలికగా తీసుకోవద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా కప్ 2025లో సూపర్-4 మ్యాచ్లు ఆరంభం అయ్యాయి. శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ అద్భుత విజయం సాధించింది. నేడు చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి 8 గంటలకు ఇండో-పాక్ మ్యాచ్ ప్రారంభం కానుంది. లీగ్ దశలో ఇప్పటికే పాకిస్థాన్ను సునాయాసంగా ఓడించిన భారత్.. మరో విజయంపై కన్నేసింది. లీగ్ మ్యాచ్ పరాభవానికి బదులు తీర్చుకోవాలని పాక్ చూస్తోంది. పాకిస్థాన్తో మ్యాచ్ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ దీప్ దాస్గుప్తా టీమిండియాను హెచ్చరించారు. పాక్ బౌలింగ్ ఎప్పుడూ ప్రమాదకరమే అని, దాయాది జట్టును అస్సలు తేలికగా తీసుకోవద్దని చెప్పారు.
‘గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ మెరుగైన క్రికెట్ ఆడడం లేదు. జట్టులో మంచి ప్లేయర్స్ ఉన్నారు కానీ.. ఓ యూనిట్గా రాణించడం లేదు. అయినప్పటికీ పాక్ ఎల్లప్పుడూ ప్రమాదకరమైన జట్టే. పొట్టి ఫార్మాట్లో ఏ జట్టును తేలికగా తీసుకోలేం. నాణ్యత పరంగా చూస్తే భారత్ కంటే పాకిస్థాన్ చాలా దిగువలో ఉంది. అయినా కూడా దాయాది టీమ్ ఇప్పటికీ ప్రమాదకరమైన జట్టు. పాకిస్థాన్లో ఎల్లప్పుడూ నాణ్యమైన బౌలర్లు ఉంటారు. వారి బ్యాటింగ్ మాత్రం ఆందోళన కలిగించేదే. ఆసియా కప్ 2025లో కూడా పాక్ బ్యాటింగ్ విభాగంలో సమస్యలు ఎదుర్కొంటోంది. బౌలింగ్ మాత్రం పటిష్టంగా ఉంది. అండర్ డాగ్స్ పాకిస్థాన్ను తేలికగా తీసుకోలేం’ అని దీప్ దాస్గుప్తా సూచించారు.
Also Read
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
- Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
- TTD Record: రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం.. టీటీడీ చరిత్రలోనే అరుదైన రికార్డు!
- Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
Also Read: Smriti Mandhana: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. వన్డే క్రికెట్ చరిత్రలోనే..!
‘ఆసియా కప్ 2025లో భారత జట్టుకు ఇంకా సవాళ్లు ఎదురుకాలేదు. సూపర్-4లో మనకు పోటీ ఎదురుకానుంది. పాకిస్థాన్ సహా బంగ్లాదేశ్, శ్రీలంకలను ఢీకొట్టాల్సి ఉంది. ఇప్పటివరకు భారత్ ప్రదర్శన బాగానే ఉంది, లోపాలు చెప్పడానికి ఏమీ లేదు. దుబాయ్లో ముగ్గురు స్పిన్నర్లను ఆడించాలనే నిర్ణయం మంచిదే. దుబాయ్ పరిస్థితుల్లో ముగ్గురు స్పిన్నర్లలో ఇద్దరు మణికట్టు స్పిన్నర్లు ఉండడం కలిసొచ్చే అంశం. మణికట్టు స్పిన్నర్లు మ్యాచ్ విన్నర్లు. అన్ని ఫార్మాట్లలో వారు జట్టుకు అవసరం’ అని దీప్ దాస్గుప్తా చెప్పుకొచ్చారు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలు బరిలోకి దిగనున్నారు.
తాజావార్తలు
-
Venkatesh Iyer: ట్రోలింగ్ నన్ను ప్రభావితం చేసింది.. ఆ మ్యాచ్ నా కెరీర్లో కీలక మలుపు!
-
Kollywood : రూట్ మార్చిన కోలీవుడ్ స్టార్స్.. మళ్లీ కమర్షియల్ జోన్లోకి సూర్య, విక్రమ్, ధనుష్, శివకార్తికేయన్!
-
PM Svanidhi: 55 లక్షల మందికి గుడ్ న్యూస్.. పీఎం స్వనిధి పథకంలో మరిన్ని ప్రయోజనాలు..పూర్తి వివరాలు ఇవే!
-
Trump Tariff Cut: ట్రంప్ కీలక నిర్ణయం.. టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు.. ఈ రంగాలకు ప్రయోజనం
-
Horror Thriller OTT : మగాళ్లను వశం చేసుకునే మోహినీ పిశాచి… ఓటీటీలోకి వచ్చిన హారర్ థ్రిల్లర్
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!