IND vs PAK: పాకిస్థాన్తో సూపర్-4 మ్యాచ్.. టీమిండియాకు హెచ్చరిక!
- దుబాయ్ వేదికగారాత్రి 8 గంటలకు ఇండో-పాక్ మ్యాచ్
- పాక్ బౌలింగ్ ఎప్పుడూ ప్రమాదకరమే
- దాయాది జట్టును అస్సలు తేలికగా తీసుకోవద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా కప్ 2025లో సూపర్-4 మ్యాచ్లు ఆరంభం అయ్యాయి. శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ అద్భుత విజయం సాధించింది. నేడు చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి 8 గంటలకు ఇండో-పాక్ మ్యాచ్ ప్రారంభం కానుంది. లీగ్ దశలో ఇప్పటికే పాకిస్థాన్ను సునాయాసంగా ఓడించిన భారత్.. మరో విజయంపై కన్నేసింది. లీగ్ మ్యాచ్ పరాభవానికి బదులు తీర్చుకోవాలని పాక్ చూస్తోంది. పాకిస్థాన్తో మ్యాచ్ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ దీప్ దాస్గుప్తా టీమిండియాను హెచ్చరించారు. పాక్ బౌలింగ్ ఎప్పుడూ ప్రమాదకరమే అని, దాయాది జట్టును అస్సలు తేలికగా తీసుకోవద్దని చెప్పారు.
‘గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ మెరుగైన క్రికెట్ ఆడడం లేదు. జట్టులో మంచి ప్లేయర్స్ ఉన్నారు కానీ.. ఓ యూనిట్గా రాణించడం లేదు. అయినప్పటికీ పాక్ ఎల్లప్పుడూ ప్రమాదకరమైన జట్టే. పొట్టి ఫార్మాట్లో ఏ జట్టును తేలికగా తీసుకోలేం. నాణ్యత పరంగా చూస్తే భారత్ కంటే పాకిస్థాన్ చాలా దిగువలో ఉంది. అయినా కూడా దాయాది టీమ్ ఇప్పటికీ ప్రమాదకరమైన జట్టు. పాకిస్థాన్లో ఎల్లప్పుడూ నాణ్యమైన బౌలర్లు ఉంటారు. వారి బ్యాటింగ్ మాత్రం ఆందోళన కలిగించేదే. ఆసియా కప్ 2025లో కూడా పాక్ బ్యాటింగ్ విభాగంలో సమస్యలు ఎదుర్కొంటోంది. బౌలింగ్ మాత్రం పటిష్టంగా ఉంది. అండర్ డాగ్స్ పాకిస్థాన్ను తేలికగా తీసుకోలేం’ అని దీప్ దాస్గుప్తా సూచించారు.
Also Read
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
Also Read: Smriti Mandhana: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. వన్డే క్రికెట్ చరిత్రలోనే..!
‘ఆసియా కప్ 2025లో భారత జట్టుకు ఇంకా సవాళ్లు ఎదురుకాలేదు. సూపర్-4లో మనకు పోటీ ఎదురుకానుంది. పాకిస్థాన్ సహా బంగ్లాదేశ్, శ్రీలంకలను ఢీకొట్టాల్సి ఉంది. ఇప్పటివరకు భారత్ ప్రదర్శన బాగానే ఉంది, లోపాలు చెప్పడానికి ఏమీ లేదు. దుబాయ్లో ముగ్గురు స్పిన్నర్లను ఆడించాలనే నిర్ణయం మంచిదే. దుబాయ్ పరిస్థితుల్లో ముగ్గురు స్పిన్నర్లలో ఇద్దరు మణికట్టు స్పిన్నర్లు ఉండడం కలిసొచ్చే అంశం. మణికట్టు స్పిన్నర్లు మ్యాచ్ విన్నర్లు. అన్ని ఫార్మాట్లలో వారు జట్టుకు అవసరం’ అని దీప్ దాస్గుప్తా చెప్పుకొచ్చారు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలు బరిలోకి దిగనున్నారు.
తాజావార్తలు
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Oscars Academy :’RRR’ ఎడిటర్కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
-
Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్కు రంగం సిద్ధం
-
Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
-
Divija Prabhakar: ఎంతో కస్టపడి సినిమా చేశాం.. ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ అందరికీ నచ్చుతుంది!
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!