Asia Cup 2025: చర్చించడానికి ఏమీ లేదు, ట్రోఫీ మాదే.. పీసీబీకి బీసీసీఐ అల్టిమేటం!
- ఆసియా కప్ ఫైనల్ 2025లో భారత్ విజయం
- ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించిన టీమిండియా ప్లేయర్స్
- ట్రోఫీని హాటల్కు తీసుకెళ్లిన పీసీబీ చీఫ్
- పీసీబీకి బీసీసీఐ అల్టిమేటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెప్టెంబర్ 28న దుబాయ్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన ఆసియా కప్ ఫైనల్ 2025లో భారత్ గెలిచిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం స్టేడియంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పీసీబీ చీఫ్, ఏసీసీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా ప్లేయర్స్ తిరస్కరించారు. దాంతో నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీతో పాటు భారత ఆటగాళ్లకు దక్కాల్సిన విజేత పతకాలను కూడా హాటల్కు తీసుకెళ్లిపోయాడు. దాంతో పీసీబీ, బీసీసీఐ మధ్య వివాదం చెలరేగింది.
పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ తీరుపై బీసీసీఐ గుర్రుగా ఉంది. ఆసియా కప్ ట్రోఫీని నఖ్వీ తనతో పాటు తీసుకెళ్లడంపై మంగళవారం జరిగిన ఏసీసీ ఏజీఎం సమావేశంలో బీసీసీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏసీసీ సమావేశానికి వర్చువల్గా హాజరైన బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా.. నఖ్వీపై ఫైర్ అయ్యారు. ట్రోఫీ ఏసీసీ సొత్తు ఏమీ కాదని, నఖ్వీది అయితే అస్సలు కాదని గుర్తు చేశారు. ట్రోఫీని వేంటనే భారత్కు అందించాలని డిమాండ్ చేశారు. ట్రోఫీ విషయంలో ఏసీసీ జోక్యం చేసుకోవాలని రాజీవ్ శుక్లా కోరారు.
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
ఆసియా కప్ ట్రోఫీని తన చేతుల మీదుగా స్వీకరించబోమని భారత ప్లేయర్స్ లిఖితపూర్వకంగా సమాచారం ఇవ్వలేదని సమావేశంలో ఏసీసీ ఛైర్మన్ చెప్పాడు. ట్రోఫీపై శుక్లా ప్రశ్నలు సాధించగా.. సమావేశంలో కాకుండా వేరే వేదికపై మాట్లాడుతా నఖ్వీ బదులిచ్చాడు. దాంతో శుక్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రోఫీని వెంటనే ఏసీసీ కార్యాలయంలో పెట్టాలని, అక్కడి నుంచి తాము తీసుకుంటామని శుక్లా స్పష్టం చేశారు. అందుకు అంగీకరించని నఖ్వీ.. ట్రోఫీ విషయంలో చర్చించాల్సిన అవసరముందన్నాడు. ట్రోఫీ తమదే అని, చర్చించడానికి ఇంకా ఏమీ లేదని శుక్లా అల్టిమేటం జారీ చేశారు. ఈ విషయంపై ఐసీసీకి ఫిర్యాదు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!