Asia Cup 2025: చర్చించడానికి ఏమీ లేదు, ట్రోఫీ మాదే.. పీసీబీకి బీసీసీఐ అల్టిమేటం!
- ఆసియా కప్ ఫైనల్ 2025లో భారత్ విజయం
- ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించిన టీమిండియా ప్లేయర్స్
- ట్రోఫీని హాటల్కు తీసుకెళ్లిన పీసీబీ చీఫ్
- పీసీబీకి బీసీసీఐ అల్టిమేటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెప్టెంబర్ 28న దుబాయ్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన ఆసియా కప్ ఫైనల్ 2025లో భారత్ గెలిచిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం స్టేడియంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పీసీబీ చీఫ్, ఏసీసీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా ప్లేయర్స్ తిరస్కరించారు. దాంతో నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీతో పాటు భారత ఆటగాళ్లకు దక్కాల్సిన విజేత పతకాలను కూడా హాటల్కు తీసుకెళ్లిపోయాడు. దాంతో పీసీబీ, బీసీసీఐ మధ్య వివాదం చెలరేగింది.
పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ తీరుపై బీసీసీఐ గుర్రుగా ఉంది. ఆసియా కప్ ట్రోఫీని నఖ్వీ తనతో పాటు తీసుకెళ్లడంపై మంగళవారం జరిగిన ఏసీసీ ఏజీఎం సమావేశంలో బీసీసీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏసీసీ సమావేశానికి వర్చువల్గా హాజరైన బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా.. నఖ్వీపై ఫైర్ అయ్యారు. ట్రోఫీ ఏసీసీ సొత్తు ఏమీ కాదని, నఖ్వీది అయితే అస్సలు కాదని గుర్తు చేశారు. ట్రోఫీని వేంటనే భారత్కు అందించాలని డిమాండ్ చేశారు. ట్రోఫీ విషయంలో ఏసీసీ జోక్యం చేసుకోవాలని రాజీవ్ శుక్లా కోరారు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ఆసియా కప్ ట్రోఫీని తన చేతుల మీదుగా స్వీకరించబోమని భారత ప్లేయర్స్ లిఖితపూర్వకంగా సమాచారం ఇవ్వలేదని సమావేశంలో ఏసీసీ ఛైర్మన్ చెప్పాడు. ట్రోఫీపై శుక్లా ప్రశ్నలు సాధించగా.. సమావేశంలో కాకుండా వేరే వేదికపై మాట్లాడుతా నఖ్వీ బదులిచ్చాడు. దాంతో శుక్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రోఫీని వెంటనే ఏసీసీ కార్యాలయంలో పెట్టాలని, అక్కడి నుంచి తాము తీసుకుంటామని శుక్లా స్పష్టం చేశారు. అందుకు అంగీకరించని నఖ్వీ.. ట్రోఫీ విషయంలో చర్చించాల్సిన అవసరముందన్నాడు. ట్రోఫీ తమదే అని, చర్చించడానికి ఇంకా ఏమీ లేదని శుక్లా అల్టిమేటం జారీ చేశారు. ఈ విషయంపై ఐసీసీకి ఫిర్యాదు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!