Asia Cup 2025: చర్చించడానికి ఏమీ లేదు, ట్రోఫీ మాదే.. పీసీబీకి బీసీసీఐ అల్టిమేటం!
- ఆసియా కప్ ఫైనల్ 2025లో భారత్ విజయం
- ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించిన టీమిండియా ప్లేయర్స్
- ట్రోఫీని హాటల్కు తీసుకెళ్లిన పీసీబీ చీఫ్
- పీసీబీకి బీసీసీఐ అల్టిమేటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెప్టెంబర్ 28న దుబాయ్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన ఆసియా కప్ ఫైనల్ 2025లో భారత్ గెలిచిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం స్టేడియంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పీసీబీ చీఫ్, ఏసీసీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా ప్లేయర్స్ తిరస్కరించారు. దాంతో నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీతో పాటు భారత ఆటగాళ్లకు దక్కాల్సిన విజేత పతకాలను కూడా హాటల్కు తీసుకెళ్లిపోయాడు. దాంతో పీసీబీ, బీసీసీఐ మధ్య వివాదం చెలరేగింది.
పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ తీరుపై బీసీసీఐ గుర్రుగా ఉంది. ఆసియా కప్ ట్రోఫీని నఖ్వీ తనతో పాటు తీసుకెళ్లడంపై మంగళవారం జరిగిన ఏసీసీ ఏజీఎం సమావేశంలో బీసీసీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏసీసీ సమావేశానికి వర్చువల్గా హాజరైన బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా.. నఖ్వీపై ఫైర్ అయ్యారు. ట్రోఫీ ఏసీసీ సొత్తు ఏమీ కాదని, నఖ్వీది అయితే అస్సలు కాదని గుర్తు చేశారు. ట్రోఫీని వేంటనే భారత్కు అందించాలని డిమాండ్ చేశారు. ట్రోఫీ విషయంలో ఏసీసీ జోక్యం చేసుకోవాలని రాజీవ్ శుక్లా కోరారు.
Also Read
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
- Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. 'బేబీ బాస్'ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
ఆసియా కప్ ట్రోఫీని తన చేతుల మీదుగా స్వీకరించబోమని భారత ప్లేయర్స్ లిఖితపూర్వకంగా సమాచారం ఇవ్వలేదని సమావేశంలో ఏసీసీ ఛైర్మన్ చెప్పాడు. ట్రోఫీపై శుక్లా ప్రశ్నలు సాధించగా.. సమావేశంలో కాకుండా వేరే వేదికపై మాట్లాడుతా నఖ్వీ బదులిచ్చాడు. దాంతో శుక్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రోఫీని వెంటనే ఏసీసీ కార్యాలయంలో పెట్టాలని, అక్కడి నుంచి తాము తీసుకుంటామని శుక్లా స్పష్టం చేశారు. అందుకు అంగీకరించని నఖ్వీ.. ట్రోఫీ విషయంలో చర్చించాల్సిన అవసరముందన్నాడు. ట్రోఫీ తమదే అని, చర్చించడానికి ఇంకా ఏమీ లేదని శుక్లా అల్టిమేటం జారీ చేశారు. ఈ విషయంపై ఐసీసీకి ఫిర్యాదు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది.
తాజావార్తలు
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
-
Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
-
Pradeep Ranganathan: ఆ డైరెక్టర్’తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!