ప్రముఖ గాయని, పద్మవిభూషణ్ గ్రహీత ఆశా భోస్లే తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరడం సంగీత ప్రపంచాన్ని కలవరపెడుతోంది. 92 ఏళ్ల వయసున్న ఆశా భోస్లే గారు గత కొద్దిరోజులుగా తీవ్రమైన అలసట, ఛాతీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. దీనితో కుటుంబ సభ్యులు ఆమెను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స అందుతోంది. అయితే
Also Read : Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్ ఖాతాలో మొదటి ఫ్లాప్.. ‘LIK’ ఎందుకు ఫెయిల్ అయ్యింది?
తాజాగా ఆమె మనవరాలు జానై భోస్లే (Zanai Bhosle) సోషల్ మీడియా వేదికగా ఆమె ఆరోగ్య పరిస్థితిని వివరించారు.. ‘అమ్మమ్మ ఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది, ఆమె త్వరలోనే కోలుకుంటుందని ఆశిస్తున్నాము. ఈ సమయంలో మా ప్రైవసీకి గౌరవం ఇవ్వాలని కోరుతున్నాము’ అని జానై పేర్కొన్నారు. మరోవైపు, ఆశా భోస్లే చికిత్సకు స్పందిస్తున్నారని ఆమె సన్నిహితులు సానుకూల అప్డేట్స్ ఇస్తున్నారు. ఆమె స్పృహలోనే ఉన్నారని, వైద్యులతో మాట్లాడుతున్నారని సమాచారం. తను బాగానే ఉన్నానని చెప్పడానికి ఆమె థమ్స్ అప్ (బ్రొటనవేళ్లు) చూపిస్తున్నట్లు సన్నిహితులు పోస్ట్ చేశారు. భారత రత్న లతా మంగేష్కర్ సోదరిగా మాత్రమే కాకుండా, ఏడు దశాబ్దాలకు పైగా వేలాది పాటలతో యావత్ భారతాన్ని ఉర్రూతలూగించిన ఆశా భోస్లే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని అభిమానులు, సినీ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు.