Asaduddin Owaisi: పార్లమెంట్లో పాలస్తీనా నినాదం.. ఒవైసీకి బరేలీ కోర్టు సమన్లు
- అసదుద్దీన్ ఒవైసీకి బరేలీ కోర్టు సమన్లు
- పార్లమెంట్లో జై పాలస్తీనా అంశంపై దావా
- జనవరి 7న హాజరు కావాలని కోర్టు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి ఉత్తరప్రదేశ్లోని బరేలీ కోర్టు సమన్లు జారీ చేసింది. పార్లమెంట్లో జై పాలస్తీనా అనే నినాదానికి చెందిన అంశంపై 2025 జనవరి 7న కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఒవైసీ ప్రకటనపై న్యాయవాది వీరేంద్ర గుప్తా కోర్టులో దావా వేశారు. తాజాగా కోర్టు సెషన్స్ జడ్జి క్రిమినల్ సర్వైలెన్స్ మీర్గంజ్ నోటీసు జారీ చేశారు. ఒవైసీ రాజ్యాంగ, చట్టపరమైన సూత్రాలను ఉల్లంఘించారని కోర్టులో దాఖలైన దావాలో వీరేంద్ర గుప్తా ఆరోపించారు. ఈ నినాదం చట్టపరమైన సూత్రాలకు వ్యతిరేకమన్నారు.
READ MORE: Health: వెల్లుల్లిని ఆహారంలో కాకుండా ఇలా తినండి.. రోగాలకు చెక్ పెట్టండి
Also Read
అసలేం జరిగింది?
కాగా.. ఇటీవల లోక్సభలో ఎంపీగా ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో హైదరాబాద్ ఎంపీ చేసిన నినాదాలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. ‘జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా’ అంటూ ఆయన నినాదాలు చేశారు. దీనిపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఎంపీగా ఒవైసీపై అనర్హత వేటు వేయాలని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుకి ఫిర్యాదులు అందాయి. బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరారు. పరాయి దేశానికి విధేయత చూపించినందుకు ఒవైసీని అనర్హుడి ప్రకటించవచ్చని సూచించారు. ఇదిలా ఉండగా.. ఒవైసీ తన చర్యను సమర్థించుకున్నారు. ఇలా అనడంతో తప్పులేదని పేర్కొన్నారు. రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఇలా నినాదాలు చేయొద్దనే నిబంధనలు లేవని చెప్పారు. పాలస్తీనా గురించి మహాత్మా గాంధీ ఏం చెప్పారో చదవండి అంటూ సూచించారు.
READ MORE:CM Chandrababu: పింఛన్ల తొలగింపుపై సీఎం కీలక వ్యాఖ్యలు..
మరోవైపు కాంగ్రెస్ నేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీకి కూడా బరేలీ ఎంపీ ఎమ్మెల్యే కోర్టు నోటీసులు జారీ చేసింది. జనవరి 7న కోర్టుకు హాజరు కావాలని రాహుల్ గాంధీని కోర్టు ఆదేశించింది. ఆర్థిక సర్వేకు సంబంధించి రాహుల్ గాంధీ ఇచ్చిన ప్రకటనపై హిందుత్వ నేత పంకజ్ పాఠక్ కోర్టులో దావా వేశారు. దీనిపై ఇప్పుడు కోర్టు రాహుల్కి నోటీసు జారీ చేసి హాజరుకావాలని ఆదేశించింది. ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా హిందూ సమాజంలో భయానక వాతావరణం సృష్టించారని కోర్టులో దాఖలైన వ్యాజ్యంలో పేర్కొన్నారు. ముస్లిం సమాజాన్ని మభ్యపెట్టి హిందువుల ఆస్తులను లాక్కోవడానికి రాహుల్ ఇలాంటి ప్రకటన చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుడి ప్రకటన తనను తీవ్రంగా బాధించిందని, అందుకే కోర్టులో దావా వేసినట్లు చెప్పారు.
తాజావార్తలు
-
AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్..
-
Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ ‘డెడ్ డ్రాప్’ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
-
Mohammed Siraj: కెప్టెన్గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
-
Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్పై రష్మిక కామెంట్స్ వైరల్!
-
Water Crisis: హైదరాబాద్ కు తాగునీటి ముప్పు..!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!