Kejriwal Rewari Par Charcha: ‘రేవారీ పర్ చర్చా’ పేరుతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మాజీ సీఎం
- 'రేవారీ పర్ చర్చా' పేరుతో
- అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మాజీ సీఎం కేజ్రీవాల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kejriwal Rewari Par Charcha: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరుపున ‘రేవారి పే చర్చా’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ఆరుగురు రేవాడీలను ప్రస్తావించారు. దీంతో పాటు బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ఢిల్లీకి వస్తే కరెంటు, నీళ్ల బిల్లులు కట్టాల్సిందేనని కేజ్రీవాల్ అన్నారు. 20 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 24 గంటలు కరెంటు లేదని కేజ్రీవాల్ అన్నారు. ఇప్పుడు ఢిల్లీలో కరెంటు కోత లేదని కేజ్రీవాల్ అన్నారు. ఈ 20 రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటు లేదని అన్నారు.
Also Read: Air Pollution: ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం.. ఉక్కిరిబిక్కిరైన ప్రజలు
Also Read
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో బారీగా..! కారణమేంటి?
- YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
- Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
- International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
ఇకపోతే, గుజరాత్లో 30 ఏళ్ల ప్రభుత్వం ఉందని.. అక్కడ గత 30 ఏళ్లుగా 24 గంటల కరెంటు లేదని ఆయన అన్నారు. 24 గంటలూ కరెంటు ఇవ్వాలని.. వారికి తెలియదని అన్నారు. ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేయకుండా, బీజేపీకి ఓటేస్తే ఢిల్లీలో కూడా 8 నుంచి 10 గంటల విద్యుత్ కోతలు మొదలవుతాయని ఆయన అన్నారు. దీనితోపాటు.. కమలం బటన్ను నొక్కే ముందు, ఎక్కువసేపు విద్యుత్ కోత కోసం బటన్ను నొక్కుతున్నారా అని ఆలోచించండి. లేకపోతే, చీపురు బటన్ను నొక్కండని ఆయన ప్రజలకు కోరారు. అలాగే రాజస్థాన్లో ఎన్ని గంటల విద్యుత్ కోతలు ఉన్నాయని కేజ్రీవాల్ అడిగారు. దేశం మొత్తం మీద ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాలు ఢిల్లీ, పంజాబ్ మాత్రమే ప్రభుత్వం ఏర్పడి 10 ఏళ్లు గడుస్తున్నా ఢిల్లీలో 24 గంటల ఉచిత విద్యుత్ను అందించామని ఆయన ఈ సందర్బంగా తెలిపారు.
Also Read: IND vs AUS: ఐపీఎల్ వేలంలో ఏ టీంకు వెళ్తున్నావు..? మ్యాచ్ మధ్యలో నాథన్ లియాన్, పంత్ సంభాషణ
ఇక కేజ్రీవాల్ ఇచ్చిన ఆరు రేవారీలు ఈ విధంగా ఉన్నాయి.
* మొదటి రేవారీ: ఉచిత విద్యుత్ ఇవ్వడం, కరెంటు కోత లేకుండా చేయడం.
* రెండవ రేవారీ: 20 వేల లీటర్ల నీరు ఉచితంగా అందివ్వడం.
* మూడవ రేవారీ: ఉచిత, అద్భుతమైన విద్యను అందించడం.
* నాల్గవ రేవారీ: షాందార్ మొహల్లా క్లినిక్ ఏర్పాటు
* ఐదవ రేవారీ: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడం.
* ఆరవ రేవారి: వృద్ధులకు ఉచిత తీర్థయాత్ర.
दिल्ली की जनता करेगी मुफ़्त की 6 रेवड़ियों की रक्षा💯
1️⃣ 24 घंटे मुफ़्त बिजली
2️⃣ मुफ़्त पानी
3️⃣ अच्छी और शानदार मुफ़्त शिक्षा
4️⃣ शानदार मोहल्ला क्लीनिक और सरकारी अस्पताल
5️⃣ महिलाओं को मुफ़्त बस यात्रा
6️⃣ बुजुर्गों को मुफ़्त तीर्थ यात्राअब अगर बीजेपी दिल्ली में आ जाती है तो… pic.twitter.com/EM8VlNGXZU
— AAP (@AamAadmiParty) November 22, 2024
తాజావార్తలు
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
-
Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత… తెలుగు రాష్ట్రాల్లో బారీగా..! కారణమేంటి?
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!