NTV Telugu Site icon

Delhi: ప్రధాని ఇంటి ముట్టడికి ఆప్.. ఢిల్లీలో పోలీసుల ఆంక్షలు..

Delhi

Delhi

ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముట్టడికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. మద్యం పాలసీ కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. దీనికి వ్యతిరేకంగా వారు ప్రధాని నివాసంపై నేడు ఆందోళన చేపట్టనుంది. అలాగే, కేజ్రీవాల్ అరెస్టుపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. మోడీ ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తమ పోరాటం ఉధృతం చేసేందుకు సిద్ధమైనట్లు వెల్లడించారు.

Read Also: HanuMan : మరో ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ..

ఇక, ఢిల్లీలో శాంతిభద్రతల దృష్ట్యా నేడు ( మంగళవారం ) ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీ ప్రాంతంలో ట్రాఫిక్ నిర్వహణ సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు నగరంలో ట్రాఫిక్ మళ్లీంపు చేపట్టారు. తుగ్లక్ రోడ్, సఫ్దర్‌జంగ్ రోడ్, కమల్ అతాతుర్క్ మార్గ్‌లలో ఎక్కడా ఏ వాహనం ఆపడానికి లేదా పార్కింగ్ చేయడానికి పర్మిషన్ లేదని పోలీసులు చెప్పారు. అలాగే, కమల్ అటా టర్క్ మార్గ్, సఫ్దర్‌జంగ్ రోడ్, అక్బర్ రోడ్, తీన్ మూర్తి మార్గ్ రూట్ లో ప్రయాణికులు వెళ్లొద్దని వారు సూచించారు.

Read Also: Allu Arjun: ఫ్యామిలీతో దుబాయ్ వెళ్లిన ఐకాన్ స్టార్.. ఎందుకంటే?

అలాగే, రైల్వే స్టేషన్లు, ఇందిరాగాంధీ విమానాశ్రయం వైపు వెళ్లే ప్రయాణికులు తమ ప్రయాణాన్ని తగినంత సమయంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని పోలీసులు తెలిపారు. లేకుంటే వారు ఈ ట్రాఫిక్ లో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇక, ఢిల్లీలోని సాధారణ ప్రజలు, వాహనదారులు ఓపికగా ఉండాలని.. ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఢిల్లీ పోలీసులు సూచించారు. అన్ని కూడళ్లలో మోహరించిన ట్రాఫిక్ సిబ్బంది సూచనలను పాటించాలని చెప్పుకొచ్చారు.