Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఏడు రోజుల ఈడీ కస్టడీకి రామచంద్ర పిళ్లై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైను ఈడీ అధికారులు రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో ఈడీ వాదనలు వినిపించింది. అరుణ్ రామచంద్ర పిళ్లైని ఏడు రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ న్యాయస్థానాన్ని కోరింది. ఈ నేపథ్యంలో ఈ నెల 13వరకు ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. పిళ్లై విచారణకు సహకరించడం లేదని ఈడీ న్యాయస్థానానికి తెలిపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రతినిధి అంటూ అరుణ్ రామచంద్ర పిళ్ళై అంగీకరించారని… ఆయనను ఏడు రోజుల కస్టడీకి ఇవ్వండి అంటూ ఈడీ కోర్టును కోరింది. కేసు దర్యాప్తుకు సహకరించడం లేదని, మనీ ట్రయల్స్ గుట్టు తేల్చడానికి కస్టడీ అవసరమని, రూ.25కోట్లు నేరుగా ట్రాన్స్ఫర్ చేశారు..అంటూ ఈడీ వాదనలు వినిపించింది. అయితే పిళ్లైను అరెస్ట్ చేసేందుకు ఇంత ఆలస్యం ఎందుకు అయ్యిందని ఈడీ అధికారులను న్యాయమూర్తి ప్రశ్నించారు. లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్ సాక్ష్యం ఉన్న తర్వాత పదే పదే పిలిచి ఎందుకు ప్రశ్నలు అడుగుతున్నారని… నేరుగా అరెస్ట్ చేయవచ్చు కదా అని న్యాయమూర్తి అడిగారు. ప్రస్తుతం కోర్టులో వాదనలు ముగిశాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైను గత రాత్రి ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మద్యం కుంభకోణంలో అవకతవకలపై ఇటీవల రెండు రోజులపాటు రామచంద్ర పిళ్లైని ఈడీ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అరుణ్ పిళ్ళైకి చెందిన వట్టినాగులాపల్లిలో రూ .2.2 కోట్ల విలువైన భూమిని కూడా ఈడీ జప్తు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి రామచంద్ర పిళ్లైతో కలిపి ఇప్పటి వరకూ 11 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. ఇండో స్పిరిట్లో పిళ్లై భాగస్వామిగా ఉన్నాడని ఈడీ వెల్లడించింది. లిక్కర్ పాలసీ కోసం జరిగిన సమావేశాల్లో పిళ్లై పాల్గొన్నాడు. సమీర్ మహేంద్రుడితో కలిసి పిళ్ళై లిక్కర్ స్కాంలో కీలకంగా వ్యవహరించాడు. అరుణ్ పిళ్ళై, బుచ్చిబాబుకి సంబంధించిన వాట్సాప్ చాట్స్ ఉన్నాయని ఈడీ తెలిపింది. సౌత్ గ్రూప్ చెల్లించిన కిక్ బ్యాక్ అమౌంట్ పంపిణీలో ప్రధాన పాత్ర ఉందని పేర్కొంది. అరుణ్ పిళ్ళైతో బుచ్చిబాబును కలిపి విచారించాలని ఈడీ వెల్లడించింది.
Also Read
Read Also: Sri chaitanya college: సాత్విక్ ఆత్మహత్య.. శ్రీచైతన్య కళాశాలకు శాశ్వత గుర్తింపు రద్దు
అరుణ్ పిళ్లై తరఫు న్యాయవాది కూడా తమ వాదనలు వినిపించారు. 29 రోజులు విచారణ జరిపారని..కానీ ఈడీకి సహకరించటం లేదు అని అంటున్నారని పిళ్లై తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈడీ అడిగినా వాటికి అన్ని సమాధానాలు పిళ్లై ఇచ్చాడని.. 29 సార్లు అరుణ్ పిళ్ళై విచారణను ఈడీ అధికారులు రికార్డ్ చేశారన్నారు. అరుణ్ పిళ్లై అమ్మ ఆరోగ్య బాగాలేదని.. థైరాయిడ్, మజిల్ పెయిన్ కిల్లర్ మెడిసిన్ ఇవ్వాలని పిళ్లై తరఫు న్యాయవాదని కోర్టుకు విన్నవించారు.
తాజావార్తలు
-
Story Board: పుత్తడి అమ్మకాలు ఎందుకు తగ్గాయి..? ఆర్థిక పరిస్థితులే కారణమా..?
-
Neetu Bhai : కిరాణా షాపులో గంజాయి దందా.. లేడీ డ్రగ్ డాన్ అడ్డా నేలమట్టం.!
-
Off The Record: శృంగవరపు కోట TDPలో గ్రూప్ వార్!
-
UP: అమిత్ షాతో ఎస్పీ ఎంపీ భేటీ!.. అఖిలేష్ యాదవ్కు భారీ ఝలక్ తప్పదా?
-
kitchen tips: చపాతీ కర్రకు బూజు పడుతోందా? ఈ చిన్న ట్రిక్తో ఫంగస్కు చెక్ పెట్టండి!
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!