Arshdeep Singh: సూపర్ ఓవర్లో నా ప్రణాళిక అదే.. అసలు విషయం చెప్పేసిన అర్ష్దీప్!
- సూపర్ ఓవర్లో భారత్ విజయం
- అర్ష్దీప్ సింగ్ అద్భుత బౌలింగ్
- సూపర్ ఓవర్లో ప్రణాళిక ఏంటో చెప్పిన అర్ష్దీప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా కప్ 2025 సూపర్ 4లో భాగంగా శుక్రవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత్ సూపర్ ఓవర్లో గెలిచిన విషయం తెలిసిందే. మ్యాచ్ టైగా మారితే.. అర్ష్దీప్ సింగ్ అద్భుత బౌలింగ్తో శ్రీలంకను కట్టడి చేశాడు. మ్యాచ్లో అర్ష్దీప్ పెద్దగా ప్రభావం చూపలేదు. 4 ఓవర్లలో 46 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. సూపర్ ఓవర్లో మాత్రం అదరగొట్టాడు. కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి.. పెరీరా, శనకను అవుట్ చేసి హీరో అయ్యాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ సూపర్ ఓవర్లో తన ప్రణాళిక ఏంటో అర్ష్దీప్ చెప్పాడు.
‘పవర్ ప్లేలో మేం భారీగా పరుగులు ఇచ్చాం. మిగతా బౌలర్లందరూ బాగా బౌలింగ్ చేసి మ్యాచ్ను సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లారు. సూపర్ ఓవర్లో నా ప్రణాళిక స్పష్టంగా ఉంది. వైడ్ యార్కర్లు వేసి శ్రీలంక బ్యాటర్లను ఆఫ్సైడ్ ఆడించాలని చూశా. అది వర్కౌట్ అయింది. జట్టు విజయంలో నా భాగస్వామ్యం ఉన్ననందుకు సంతోషంగా ఉంది. నిత్యం మానసికంగా సిద్ధంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తా. మ్యాచ్లో వంద శాతం బెస్ట్ ఇవ్వాలని చూస్తా. అవకాశం దక్కనప్పుడు కూడా మైదానం వెలుపలా వందశాతం ఇచ్చేందుకు ప్రయత్నించాలి. శిక్షణ, ఫిట్నెస్ మీద పూర్తి దృష్టి పెట్టాలి’ అని అర్ష్దీప్ సింగ్ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Also Read
- ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
- Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
- TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
- నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
Also Read: TVK Vijay: అల్లు అర్జున్ మాదిరి.. హీరో విజయ్ని అరెస్ట్ చేస్తారా?
ఆసియా కప్ 2025లో అర్ష్దీప్ సింగ్ ఇప్పటి వరకు కేవలం రెండు మ్యాచ్లే ఆడాడు. దుబాయ్ పిచ్లు స్పిన్కు అనుకూలం కాబట్టి.. జస్ప్రీత్ బుమ్రా ప్రధాన పేసర్గా ఆడుతున్నాడు. హార్దిక్ పాండ్యా రెండో పేసర్గా ఉన్నాడు. దాంతో అర్ష్దీప్కు అవకాశం రాలేదు. శ్రీలంక మ్యాచ్లో బుమ్రాకు రెస్ట్ ఇచ్చిన నేపథ్యంలో అర్ష్దీప్కు అవకాశం దక్కింది. ఆసియా కప్ 2025 ఫైనల్ ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ మధ్య జరగనుంది. ఫైనల్లో బుమ్రా తిరిగి రానున్న నేపథ్యంలో అర్ష్దీప్కు నిరాశ తప్పదు.
తాజావార్తలు
-
Ram Charan : హైదరాబాద్ శివార్లలో రామ్ చరణ్ లగ్జరీ ఫామ్హౌస్.. త్వరలోనే గృహప్రవేశం
-
Govinda: 7 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. మనసులోని బాధ బయటపెట్టిన గోవింద
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
ట్రెండింగ్
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!