Mexico: మెక్సికోలోని సాయుధ బృందం మంగళవారం రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖలోని 14 మంది ఉద్యోగులను కిడ్నాప్ చేసింది. దక్షిణ మెక్సికన్ రాష్ట్రమైన చియాపాస్లో భద్రతా దళాలు అపహరణకు గురైన 14 మంది భద్రతా మంత్రిత్వ శాఖకు చెందిన ఉద్యోగుల కోసం వెతుకుతున్నాయి. అపహరణకు గురైన ఉద్యోగులందరూ పురుషులేనని అధికారులు తెలిపారు. తుపాకులతో బెదిరించి భద్రతా మంత్రిత్వ శాఖలోని 14 మంది ఉద్యోగులను కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. కిడ్నాప్కు గురైన పురుష ఉద్యోగులందరినీ సాయుధ బృందం సభ్యులు రాష్ట్ర రాజధాని టక్స్ట్లా గుటిరెజ్కు పశ్చిమాన 22 మైళ్ల (34.4 కి.మీ) దూరంలో ఉన్న హైవేపైకి తీసుకెళ్లారని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
Also Read: UP: ఉత్తర ప్రదేశ్లో అరుదైన ఆపరేషన్.. మహిళ కడుపులో 5కిలోల కణతి
మొత్తం 14 మంది ఉద్యోగులు పోలీసు అధికారులు కాదని, పరిపాలన విభాగంలో పనిచేస్తున్నారని మంత్రిత్వ శాఖ ప్రతినిధి చెప్పారు. ఇంతకుముందెన్నడూ ఇలా జరగలేదని, అపహరణ వెనుక ఉద్దేశంపై విచారణ జరుపుతున్నామని అధికార ప్రతినిధి తెలిపారు. రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖలోని 14 మంది ఉద్యోగుల అపహరణపై ఫెడరల్, స్టేట్ ఏజెంట్లు దర్యాప్తు చేస్తున్నారు. వార్తా సంస్థలు విడుదల చేసిన కిడ్నాప్ వీడియోలో, హైవేపై కారు అకస్మాత్తుగా ఆపి, ఉద్యోగులందరినీ తుపాకీతో పట్టుకుని, కారు లోపలికి వెళ్లమని చెప్పారు. ఘటనకు సంబంధించిన ఛాయాచిత్రాలు, వీడియోలను పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది.