Kurnool ZP Meeting: జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే పార్థ సారథి మధ్య వాగ్వాదం.. ఓపిక లేకుంటే ఎలా?
- జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే పార్థ సారథి మధ్య వాగ్వాదం
- రైతు సమస్యలపై చర్చించే ఓపిక లేకుంటే ఎలా?
- ఎమ్మెల్యే పార్థ సారథి ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నూలు జెడ్పీ సమావేశంలో జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్యే పార్థ సారథి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం సూటిగా చెప్పాలని ఎమ్మెల్యే పార్థ సారథికి జెడ్పీ చైర్మన్ సూచించారు. రైతు సమస్యలపై చర్చించే ఓపిక లేకుంటే ఎలా? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. టైం లేకుంటే మీరు వెళ్లిపోండని, తాము చర్చించుకుంటాం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ క్రమంలో జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే పార్థ సారథి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఉన్నారు. అసెంబ్లీలో సభ్యుల కంటే అధ్యక్ష స్థానంలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఎక్కువగా మాట్లాడతారు. ఇది మాకు సమస్య. జెడ్పీ సమావేశంలో చైర్మన్ అలాగే మాట్లాతున్నారు. సభ్యులు మాట్లాడుతున్నప్పుడు ఓపికగా వినాలి, అడ్డుకుంటే ఎలా?’ అని ఎమ్మెల్యే పార్థ సారథి అన్నారు. సభా మర్యాదలు పాటించాలని, సభాధ్యక్ష స్థానంలో ఉన్న నేను అందరిని సమన్వయం చేసుకోవాలని జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి బదులిచ్చారు. ఇక జెడ్పీ సర్వసభ్య సమావేశానికి ప్రజాప్రతినిధులు డుమ్మా కొట్టారు. 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీల్లో.. మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ మాత్రమే హాజరయ్యారు. హాజరైన జెడ్పీటీసీ, ఎంపీలు పూర్తిస్థాయిలో హాజరయ్యారు.
Also Read
- Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్కు చికిత్స.. రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం..
- IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
- Motichoor Laddu Recipe: మార్కెట్ లడ్డూలు తిని విసిగిపోయారా?.. ఇంట్లోనే మెత్తని మోతీచూర్ లడ్డూ సులువుగా..
- Tilak Varma: వైస్ కెప్టెన్పై పీక్స్లో ఒత్తిడి.. నేడు తెలుగు తేజం తిలక్ వర్మకు ఛాన్స్ దక్కుతుందా?
‘కర్నూలులో ప్రైవేటు ఆసుపత్రిలో చేరితే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఎన్టీఆర్ వైద్య సేవ కింద చేరిన రోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకుంటే ఆపరేషన్లలో ఆలస్యం చేస్తున్నారు. లాగిన్ కాలేదు, అది లేదు ఇది లేదు అంటూ ఎన్ఠీఆర్ వైద్య సేవ కింద అపరేషన్లు చేయడంతో తీవ్ర జాప్యం చేస్తున్నారు. డబ్బులు ఇస్తే త్వరగా ఆపరేషన్లు చేస్తున్నారు’ అని ఎమ్మెల్యే పార్థ సారథి మండిపడ్డారు.
తాజావార్తలు
-
Salman Khan: పాకిస్తాన్ బాక్సాఫీస్ను షేక్ చేసిన సల్మాన్ సినిమా ఇదే.. 10 ఏళ్లైనా చెక్కుచెదరని రికార్డు!
-
Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్కు చికిత్స.. రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం..
-
Explainer: ప్రమాదంలో పశ్చిమ కనుమలు…ఇంతటి విలయానికి అదే కారణమా…?
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
MOTOROLA Moto Book 60 Pro: మళ్లీరాని ఆఫర్.. మోటరోలా AI ల్యాప్టాప్.. సగం ధరకే.. OLED డిస్ప్లే
ట్రెండింగ్
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!