Site icon NTV Telugu

PGCIL Recruitment 2025: BTech పాసైతే చాలు.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో 1543 జాబ్స్ రెడీ..

Power Grid

Power Grid

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ గుడ్ న్యూస్ అందించింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ పోస్టుల నియామకాల కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 1543 పోస్టులను భర్తీ చేయనున్నారు. పవర్ గ్రిడ్ ఫీల్డ్ ఇంజనీర్, ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఫీల్డ్ ఇంజనీర్ మరియు ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యా సంస్థల నుంచి BE, BTech, BSc ఇంజనీరింగ్‌లో 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఇది కాకుండా, అభ్యర్థులు ఇతర నిర్దేశిత అర్హతలను కూడా కలిగి ఉండాలి.

Also Read: Ukraine-Russia: రష్యా డ్రోన్ దాడి.. సముద్రంలో ఉక్రెయిన్ భారీ నౌక పేల్చివేత

అభ్యర్థుల గరిష్ట వయస్సు 29 సంవత్సరాలుగా నిర్ణయించారు. రిజర్వ్డ్ కేటాగిరి వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, వికలాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో, అభ్యర్థులను టెక్నికల్, ఇంగ్లీష్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు ఇస్తారు. తప్పు సమాధానాలకు నెగటివ్ మార్కింగ్ నిబంధన లేదు.

Also Read:Survey Predicts: లోక్‌సభ ఎన్నికలు జరిగితే బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయంటే.. వెలుగులోకి షాకింగ్ సర్వే

ఫీల్డ్ ఇంజనీర్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,000 నుంచి రూ.1,20,000 వరకు జీతం అందిస్తారు. అలాగే, ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.23,000 నుంచి రూ.1,05,000 వరకు జీతం ఇస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 17, 2025 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Exit mobile version