SSC Supplementary Exams: టెన్త్ ఫలితాలు విడుదల.. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SSC Supplementary Exams: ఆంధ్రప్రదేశ్లో టెన్త్ ఫలితాలను విడుదల చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. మొత్తంగా 72.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.. గత ఏడాది కంటే ఉత్తీర్ణత శాతం పెరిగింది.. పదవ తరగతి ఫలితాల్లో ఈసారి కూడా సత్తా చాటారు బాలికలు.. ఈ ఏడాది బాలికల్లో ఉత్తీర్ణత 75.38 శాతం.. బాలురుల్లో ఉత్తీర్ణత 69.27 శాతంగా ఉంది.. ఇక, 933 స్కూళ్లల్లో వంద శాతం పాస్.. 38 స్కూళ్లల్లో సున్నా శాతం ఫలితాలు.. ఫలితాల్లో టాప్ లో పార్వతీపురం మన్యం జిల్లా 85 శాతం ఉత్తీర్ణత.. లాస్ట్లో నంద్యాల జిల్లా ఉత్తీర్ణత 60.39 శాతం.. ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 95.25 శాతం ఉత్తీర్ణత ఉంది.. మరోవైపు ఫెయిలైన విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు ప్రకటించారు మంత్రి బొత్స.. దీని కోసం ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఇక, ఈ ఏడాది పరీక్షల్లో తప్పిన విద్యార్థుల కోసం స్కూళ్ళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు మంత్రి బొత్స.. మరోసారి చదివి పాస్ అయ్యేందుకు ఈ క్లాస్లు దోహదపడతాయని తెలిపారు.. ఈ నెల 13వ తేదీలోగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ అవకాశం ఉందని తెలిపారు.. అయితే, గత ఏడాది కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత 5 శాతం పెరిగిందని తెలిపారు.. జీరో ఫలితాలు వచ్చిన స్కూళ్ల సంఖ్య కూడా తగ్గిందన్నారు.. గత ఏడాది 70 స్కూళ్లలో జీరో ఫలితాలు వచ్చాయని.. ఈ సారి ఆ సంఖ్య 38కి తగ్గిందన్నారు.. ఇదే సమయంలో ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉత్తీర్ణత శాతం పెరిగింది.. 80.88 శాతం మంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు పాస్ అయ్యారని పేర్కొన్నారు..
Also Read
- Perni Nani: సిట్ విచారణపై వైసీపీ తీవ్ర అభ్యంతరం.. సాయికృష్ణ కేసులో విచారణ డొల్ల..!
- Virat Kohli One8 Shoes: కోహ్లీ కొత్త బ్రాండ్ సంచలనం.. ఒక్క రోజులోనే కోట్ల రూపాయల బిజినెస్..
- Ketan Agarwal Case: కేతన్ ముందే అనుమానించాడు, కానీ సియా నటన ముందు ఓడిపోయాడు..
- Potato Uttapam Recipe: బ్రేక్ఫాస్ట్లో కొత్త రుచి కావాలా? ఈ ఆలూ ఉత్తప్పం బెస్ట్.. 15 నిమిషాల్లో రెడీ..
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల మెరుగైన ఫలితాలు వచ్చాయని తెలిపారు మంత్రి బొత్స.. పరీక్షలు పూర్తి అయిన 18 రోజుల్లో ఫలితాలను విజయవంతంగా విడుదల చేశామన్నారు.. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఎలాంటి లీకేజీలు లేకుండా మొత్తం ప్రక్రియ నిర్వహించామన్నారు.. ఈ ప్రక్రియలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది అందరికీ అభినందనలు తెలియజేశారు.. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని.. భావోద్వేగాలకు లోనై విద్యార్థులు అఘాయిత్యాలకు పాల్పడవద్దని ధైర్యం చెప్పారు.. మీరు మళ్ళీ విజయం సాధిస్తారు… ప్రతి ఓటమి గెలుపునకు బాట వేస్తుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.
తాజావార్తలు
-
Perni Nani: సిట్ విచారణపై వైసీపీ తీవ్ర అభ్యంతరం.. సాయికృష్ణ కేసులో విచారణ డొల్ల..!
-
Hangover Relief Tips: హ్యాంగోవర్తో ఇబ్బంది పడుతున్నారా.? అయితే ఈ టిప్స్ పాటించండి..
-
Virat Kohli One8 Shoes: కోహ్లీ కొత్త బ్రాండ్ సంచలనం.. ఒక్క రోజులోనే కోట్ల రూపాయల బిజినెస్..
-
Ketan Agarwal Case: అమ్మో ‘సియా’.. సోనమ్ కంటే జిత్తులమారి.. నవ్వుతో చక్కబెట్టేసింది
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
ట్రెండింగ్
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!