YSR Congress Party: వైసీపీకి షాక్.. పార్టీకి సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శుల రాజీనామా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSR Congress Party: ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలినట్టు అయ్యింది.. వైసీపీకి రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు, కార్యదర్శి నరేంద్రబాబు రాజీనామా చేశారు.. సర్పంచుల పట్ల ప్రభుత్వ తీరుకు నిరసనగా వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు అధ్యక్ష, కార్యదర్శులు ప్రకటించారు.. ఈ సందర్భంగా పాపారావు మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా కాంగ్రెస్ లో పని చేసి తర్వాత వైసీపీలో చేరాం. సర్పంచుల సమస్యలపై ఎన్నోసార్లు మంత్రి, అధికారులను కలిశాను.. 15 శాతం నిధులు మాకు తెలియకుండా దారి మళ్లించారని.. నిధులు, విధులు లేవని నిజాంపట్నంలో సీఎం వైఎస్ జగన్ను కలిసి చెప్పాం. సీఎం అపాయింట్మెంట్ కోసం ఎందరినో కలిశాం, అయినా లాభం లేకుండాపోయిందన్నారు.. సర్పంచి వ్యవస్థకు సమాంతరంగా వాలంటరీ వ్యవస్థను తెచ్చారు.. ఇదేం న్యాయం? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Harish Rao: శ్రీజ మోములో నూరేళ్లు చిరునవ్వు వెళ్లి విరియాలి.. మంత్రి హరీష్ రావు
Also Read
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
- Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
- Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
ఎందరో సర్పంచులు ఆత్మన్యూనతతో ఆత్మహత్యలు చేసుకున్నారు అంటూ ఆవేదన బెలిబుచ్చారు పాపారావు.. ప్రభుత్వం సర్పంచుల వ్యవస్థను డమ్మీగా మార్చింది.. ప్రభుత్వ తీరుకు నిరసనగా వైసీపీకి రాజీనామా చేస్తున్నా. రాష్ట్రంలో ఇంకా చాలా మంది సర్పంచులు వైసీపీకు రాజీనామా చేసే అవకాశం ఉంది. త్వరలో జనసేన పార్టీలో చేరుదామని నిర్ణయించుకున్నానని ప్రకటించారు చిలకలపూడి పాపారావు.. మరోవైపు.. సర్పంచుల సంక్షేమ సంఘం కార్యదర్శి నరేంద్రబాబు మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ వ్యవస్థకు సమాంతరంగా వలంటరీ వ్యవస్థను తేవడాన్ని కాగ్ కూడా తప్పు పట్టిందని గుర్తుచేశారు.. పంచాయతీరాజ్ వ్యవస్థ దెబ్బతింటే గ్రామాల మనుగడ దెబ్బతింటుందన్న ఆయన.. రాష్ట్రంలో 13 వేల మంది సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారు. సర్పంచులు తలుచుకుంటే 50 లక్షల ఓట్లు ప్రభావితమవుతాయని హెచ్చరించారు. మా సమస్యలపై పోరాటం ఉద్ధృతం చేస్తామని ప్రకటించారు సర్పంచుల సంక్షేమ సంఘం కార్యదర్శి నరేంద్రబాబు.
తాజావార్తలు
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Vivo T5 5G: వివో T5 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 7,050mAh బ్యాటరీ, 144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే
-
Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
-
Kriti Sanon: సంస్కృతి గుండెల్లో ఉంటుంది, దుస్తుల్లో కాదు.. ట్రోలింగ్ పై కృతి సనన్ స్ట్రాంగ్ కౌంటర్!
-
TVS iQube MillionR Edition: 145KM రేంజ్తో TVS iQube కొత్త అవతార్.. 35.5L స్టోరేజ్, USB-C పోర్ట్తో MillionR Edition!
ట్రెండింగ్
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!