AP Ration: తల్లి, కొడుకుని కలిపిన రేషన్ బియ్యం.. 7 ఏళ్ల ముందు ఏం జరిగిందంటే?
- కర్నూలు జిల్లాలోని ఆదోనిలో ఆశ్చర్యకర ఘటన
- తల్లి, కొడుకుని కలిపిన రేషన్ బియ్యం
- రేషన్ అధికారులకు తల్లి కృతజ్ఞతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ration Rice Connects Family in Adoni: ‘రేషన్ బియ్యం’ కారణంగా ఓ తల్లి, కొడుకు కలిశారు. 7 ఏళ్ల క్రితం తప్పిపోయిన మతిస్థిమితం లేని బాలుడి కోసం.. తల్లిండ్రులు, పోలీసులు, ప్రకటనల ద్వారా ఎంత వెతికినా దొరకలేదు. బాలుడిపై ఆశలు చంపేసుకుని ఆ తల్లి జీవనం కొనసాగిస్తోంది. కాలం కలిసొచ్చిందో, దేవుడు కరుణించాడో తెలియదు కానీ.. రేషన్ బియ్యం ద్వారా చివరకు తల్లి చెంతకు చేరుకున్నాడు. ఈ ఆశ్చర్యకర, ఊహించని ఘటన కర్నూలు జిల్లాలోని ఆదోనిలో చోటుచేసుకుంది.
ఆదోనికి చెందిన వడ్డే శివశంకర్, లక్ష్మి దంపతుల కుమారుడు శ్రీకాంత్. మతిస్థిమితం సరిగా లేని శ్రీకాంత్.. తన 11వ ఏట 2018లో స్వగ్రామమంలో తప్పిపోయాడు. శ్రీకాంత్ ట్రైన్లో విజయవాడకు వెళ్లాడు. అక్కడ విజయవాడ రైల్వే పోలీసులకంటపడ్డాడు. మొదట చైల్డ్ కేర్ అధికారులకు అప్పగించారు. శ్రీకాంత్ వివరాలు ఏమి చెప్పకపోవడంతో.. విజయవాడ కలెక్టర్ ఉయ్యూరులోని ఓ రిహాబిలిటేషన్ సంస్థలో చేర్పించారు. బాలుడు టీబీతో బాధపడుతుండడంతో రిహాబిలిటేషన్ సంస్థ సిబ్బంది గుంటూరు ఆసుపత్రిలో చికిత్స అందించారు. చికిత్స అనంతరం శ్రీకాంత్ తన జీవితాన్ని పునఃప్రారంభించాడు.
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
Also Read: Pawan Kalyan: అత్యంత ధైర్యవంతమైన నిర్ణయం.. డిప్యూటీ సీఎం పవన్ పోస్ట్ వైరల్!
టూ టౌన్ పీఎస్లో శ్రీకాంత్పై మిస్సింగ్ కేసు నమోదు అయింది. బాలుడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో 2023లో పోలీసులు కేసును క్లోజ్ చేశారు. తాజాగా రేషన్ బియ్యం కోసం రేషన్ షాపు వద్దకు లక్ష్మి వెళ్లగా.. మీ రేషన్ ఉయ్యూరులో తంబ్ వేసి తీసుకెళ్లారని డీలర్ చెప్పాడు. డీలర్పై లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు డీలర్ను విచారించగా.. రేషన్ బియ్యాన్ని ఉయ్యాలూరులో తంబ్ వేసి తీసుకెళ్లినట్లు చెప్పాడు. రెవిన్యూ అధికారుల సహకారంతో పోలీసులు విషయం తెలుసుకున్నారు. టూ టౌన్ పోలీసులు తప్పిపోయిన కొడుకుని తల్లి వద్దకు చేర్చారు. 11వ ఏట తప్పిపోయిన శ్రీకాంత్.. 18వ ఏట రేషన్ బియ్యం తీసుకుని తల్లి వద్దకు చేరుకున్నాడు. రేషన్పై ఫిర్యాదు చేయడానికి వస్తే.. కొడుకుని చెంతకు చేర్చారని లక్ష్మి అధికారులకు కృతజ్ఞతలు చెప్పింది.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!