AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 1వ తేదీ ఉదయం నుంచే ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక పెన్షన్ల లబ్ధిదారులకు మరోసారి తీపి కబురు అందించింది. జూన్ నెలకు సంబంధించిన ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఇందుకోసం మొత్తం రూ. 2,728 కోట్లను కేటాయించింది. ఎప్పటిలాగే వచ్చే నెల మొదటి తారీఖున, అంటే జూన్ 1వ తేదీ సోమవారం ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఉదయం నుంచే సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి నేరుగా నగదును చేతికి అందించనున్నారు.
ఈ జూన్ నెలలో ఏపీ వ్యాప్తంగా మొత్తం 62,34,445 మంది లబ్ధిదారులకు ఈ సామాజిక భద్రతా పెన్షన్లు అందనున్నాయి. ఈసారి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భర్త లేదా భార్య చనిపోయిన వారికి ఇచ్చే ‘స్పౌజ్ పెన్షన్లను’ కొత్తగా మరో 5,606 మందికి మంజూరు చేసింది. ఈ కొత్త స్పౌజ్ పెన్షన్ల పంపిణీ కోసం ప్రత్యేకంగా రూ. 2.24 కోట్లను ప్రభుత్వం అదనంగా విడుదల చేసింది. దీనివల్ల ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద ఊరట లభించనుంది.
Also Read
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తోంది. అందులో భాగంగానే ప్రతి నెలా ఒకటో తేదీనే లబ్ధిదారుల చేతికి పెన్షన్ డబ్బులు అందేలా పక్కాగా ప్రణాళికలు అమలు చేస్తోంది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం ఈ పెన్షన్ల కోసమే ఏకంగా రూ. 65,886.57 కోట్లను ఖర్చు చేయడం విశేషం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రతి నెలా ఒకటో తేదీనే నిధులు విడుదల చేస్తూ వస్తోంది. జూన్ 1న సోమవారం తెల్లవారుజాము నుంచే ఈ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది కాబట్టి లబ్ధిదారులు ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉండి తమ పెన్షన్ డబ్బులను అందుకోవచ్చని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!