National Sports Day: క్రీడారంగానికి మంచి రోజులు రానున్నాయి.. ప్రతి ఓటమి గెలుపునకు మెట్టు..
- జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని టుడే నేషనల్ స్పోర్ట్స్ డే ర్యాలీ..
- పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. పీవీ సింధు..
- క్రీడారంగానికి మంచి రోజులు రానున్నాయన్న మంత్రి..
- ప్రతి ఓటమి గెలుపునకు మెట్టు.. కష్టపడితే తప్పకుండా ఉన్నత స్థాయికి చేరుకుంటారన్న సింధు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
National Sports Day: క్రీడారంగానికి మంచి రోజులు రానున్నాయి అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని “టుడే నేషనల్ స్పోర్ట్స్ డే” ర్యాలీని ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. ఆ తర్వాత నిర్వహించిన వేడుకల్లో మాట్లాడుతూ.. దేశంలో యువతకు కొదవ లేదు ఎన్నో విజయాలు సాధించగలరు అన్నారు.. క్రీడారంగానికి మంచి రోజులు రానున్నాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతోనే నేడు రాష్ట్రంలో గొప్ప క్రీడాకారులు వెలుగులోకి వచ్చారని పేర్కొన్నారు.. క్రీడల విషయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందన్నారు.. స్టేడియాల అభివృద్ధికి, కొత్త స్టేడియాలను అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా తెలిపారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి..
Read Also: Bill Payments: ఆర్థిక శాఖలో బిల్లుల చెల్లింపుల ప్రకంపనలు.. మంత్రి ఆమోదం లేకుండానే..!
Also Read
- Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
- Preity Zinta Support Student Protests: విద్యార్థుల ఉద్యమానికి మద్దతు.. ప్రీతి జింటా చేసిన వ్యాఖ్యలు వైరల్
- CJP Protest: పేద-ధనిక భేదం లేకుండా విద్యార్థుల పోరు.. 2012 నిర్భయ ఘటన తర్వాత ఢిల్లీలో మళ్లీ ఆ స్థాయి విప్లవం!
- TVK: నీట్ను పూర్తిగా రద్దు చేయాలి.. టీవీకే పార్టీ సంచలన డిమాండ్
ఇక, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీవీ సింధు మాట్లాడుతూ.. ప్రతి ఓటమి గెలుపునకు మెట్టుగా అభివర్ణించారు.. కష్టపడితే తప్పకుండా ఉన్నత స్థాయికి చేరుకుంటారన్న ఆమె.. భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.. ప్రతి ఒక్కరూ ఓటమికి కుంగిపోకుండా ఓటమిని మెట్టుగా చేసుకొని విజయ శిఖరాలు అవరోధించాలన్నారు.. కష్టపడితే తప్పకుండా ఉన్నత స్థాయికి చేరుకుంటారు.. ప్రతి ఒక్కరు క్రీడలు అలవాటు చేసుకోవాలన్నారు పీవీ సింధు. మరోవైపు మరో నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. జాతీయ క్రీడ దినోత్సవం సందర్భంగా పేద క్రీడాకారులకు సహాయార్థం విరాళం ప్రకటించారు.. ఇదివరకే రాజధాని నిర్మాణానికి మొదటి నెల జీతం అందజేసిన విషయం విదితమే..
తాజావార్తలు
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
Preity Zinta Support Student Protests: విద్యార్థుల ఉద్యమానికి మద్దతు.. ప్రీతి జింటా చేసిన వ్యాఖ్యలు వైరల్
-
Kiran Abbavarm : సంబరాల ఏటిగట్టు వదులుకున్న కిరణ్ అబ్బవరం.. కారణం ఏంటంటే?
-
CJP Protest: పేద-ధనిక భేదం లేకుండా విద్యార్థుల పోరు.. 2012 నిర్భయ ఘటన తర్వాత ఢిల్లీలో మళ్లీ ఆ స్థాయి విప్లవం!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!