BJP: తొలి జాబితాలో లేని ఏపీ పేర్లు! కారణమిదేనా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొత్తానికి ఈసారి ఎన్నికల నోటిఫికేషన్కు ముందే బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. 195 మందితో కూడిన తొలి జాబితాను వెల్లడించింది. ప్రధాని మోడీతో పాటు 34 మంది కేంద్రమంత్రులు కూడా ఈ జాబితాలో కనిపించారు. అంతేకాకుండా ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు కూడా ఈ ఫస్ట్లో ఉన్నారు.
తొలి జాబితాలో 16 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఇందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ జోలికి మాత్రం వెళ్లలేదు. తొలి జాబితాలో ఏపీ కూడా ఉంటుందని అనుకున్నారు. కానీ ఒక్కరు కూడా కనిపించలేదు. దీంతో ఏపీ నేతలకు నిరాశే ఎదురైంది.
Also Read
- Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు కుదిరింది. అలాగే బీజేపీతో కూడా పొత్తు ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే ఏపీ జోలికి రాలేదని తెలుస్తోంది. మరోవైపు పొత్తులపై ఏపీ బీజేపీ నేతల అభిప్రాయాలను అధిష్టానం సేకరిస్తోంది. పొత్తులపై క్లారిటీ వచ్చాకే ఏపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం విజయవాడ వేదికగా బీజేపీ నేతల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పొత్తులు-ఒంటరిగా పోటీ చేసే అంశాలపై ఢిల్లీ నుంచి వచ్చిన శివప్రకాశ్ అభిప్రాయాలను సేకరిస్తు్న్నారు. శనివారం, ఆదివారం అభిప్రాయాలు సేకరించాక.. నివేదికను ఢిల్లీ బీజేపీ పెద్దలకు అందజేయనున్నారు.
ఇదిలా ఉంటే తొలి జాబితాలో 28 మంది మహిళలతో పాటు 50 ఏళ్ల లోపు 47 మంది అభ్యర్థులు ఉన్నారు. ఓబీసీ వర్గానికి చెందిన 57 మందికి చోటు దక్కింది. మొత్తం 195 మందిలో 51 మంది ఉత్తర్ ప్రదేశ్ నుంచి, 20 మంది పశ్చిమ బెంగాల్ నుంచి, ఐదుగురు ఢిల్లీ నుంచి ఉన్నారు. మధ్యప్రదేశ్ నుంచి 24 మంది, గుజరాత్ నుంచి 15 మంది, రాజస్థాన్ నుంచి 15 మంది, తెలంగాణ నుంచి 9 మంది, కేరళ నుంచి 12 మందిని ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించింది.
మోడీ మరోసారి వారణాసి నుంచి బరిలోకి దిగుతున్నారు. అమిత్ షా గుజరాత్ గాంధీ నగర్ నుంచి , కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ గుజరాత్ పోర్బందర్ నుంచి పోటీలో ఉండనున్నారు. ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కేరళ తిరువనంతపురం నుంచి పోటీలో దిగనున్నారు. జ్యోతిరాదిత్య సింథియా మధ్యప్రదేశ్ గుణ నుంచి, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశ నుంచి లోక్సభ బరిలో ఉన్నారు.
BJP releases first list of 195 candidates for Lok Sabha elections pic.twitter.com/ms1zTtzLfL
— ANI (@ANI) March 2, 2024
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!